Thursday, 21 September 2017

మద్యం బ్రతుకులు


 
   మద్యానికి  బానిసగా మారుతూ కుటుంబ నాశనానికి దారితీస్తున్న పరిస్థితులను మనం ఈరోజు చూస్తూ ఉన్నాము .అది ఎంతగా అంటే మద్యం విసిరే పంజా దెబ్బకి ప్రతి ఒక్కరు చిక్కుకొని బయటికి రాలేక పోతున్నారు .ఎన్నో కుటుంబాలు సంతోషంగా గడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా ,ఒక్కసారిగా ఈ మహమ్మారి కి బానిసగా మారడం కుటుంబాన్ని శోక సంద్రం లో తోస్తోంది .ఇది కుటుంబ నాశనానికి దారితీస్తోంది. ఈ మహమ్మారి ఎక్కువగా పల్లెలలో ఎక్కువగా కనిపిస్తుంది .అదే విదంగా పట్టణాలలో సైతం యువత  అధికంగా ఉండటం బాధాకరం .యువత ఎక్కువగా దీనికి బానిస అవుతున్నారు .చదువుకునే వయసులోనే మద్యానికి బానిస కావడం అందర్నీ కలచి వేసే  సంఘటన ఇది .
         మద్యాన్ని ఇప్పుడు ప్రజలు తమ జీవన విధానం లో ఒక భాగంగా చేసుకున్నారు .రోజు కస్టపడి సంపాదించిన డబ్బును కుటుంబ పోషణకు కాకుండా ,మద్యానికి వెచ్చించడం భాద కల్గించే విషయం .ఆ మత్తుకు బానిసగా మారగా కుటుంబాలను సైతం రోడ్డున పడటం ఇప్పుడు మనం చూస్తున్నాము .కుటుంబంలో కర్త ఆ విదంగా చేస్తే ఇక పిల్లల పరిస్థితి ఏంటి ?వారి యొక్క భవిష్యత్తు ఏంటి ?కనీసం కుటుంబం గురించి ఏ చీకు చింత లేకుండా కస్టపడి సంపాదించిన డబ్బుని తన స్వార్థం కోసం వాడుకొని కుటుంబాన్ని భాద పెట్టడం ఇప్పుడు జరుగుతూ ఉన్న సంఘటనలు .
               
 నాకు ఒక కుటుంబం ఉంది .నాకు పిల్లలు  ఉన్నారు .వారి భవిష్యత్తు బంగారం ల ఉండాలి అని కోరుకునే వారు ఎంతమంది ?కుటుంబమును ,పిల్లల గురించి ఏ మాత్రం పట్టింపు లేకుండా మద్యానికి బానిస కావడం విశేషం .ప్రస్తుత కాలంలో ఈ మహమ్మారి యువత ఫై టార్గెట్ చేస్తూ వల విసురుతోంది ,ఆ వలలో చాలా మంది యువత చిక్కుకుపోయి  బయటపడలేక పోతున్నారు .
                
           మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవడం .ప్రస్తుత కాలంలో ఇవి ఎక్కువగా జరుగుతుండటం విశేషం .ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం వరకు వెళ్లిందంటే  అందుకు కారణం ఏమిటి ?మనిషి జీవితంలో కీలాకా పాత్ర పోషిస్తున్న మద్యనిదా లేక మద్యానికి బానిస అయి కుటుంబాన్ని పట్టించుకోక పోవడమా ?కుటుంబ నాశనానికి కారణం అవుతున్న మద్యాన్ని వెలివేయడం కుటుంబం లోని కర్తకు సాధ్యం కావడం లేదు ,అలాగే కుటుంబ పరిస్థితులపై అవగాహనా పెంచుకోవడం లేదు ,పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన లేదు .
              
           
మద్యం వాలా విసిరితే అందులో చాలామంది చిక్కుకుపోయి జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు .అది తనయొక్క పంజా ని విస్తరించుకుంటూ ,అందరి జీవితాలను నాశనం చేస్తోంది .ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్న ఈ మద్యాన్ని నిషేధించడం మనం ఎన్నుకున్న ప్రబుత్వాల వల్ల కావడం లేదు .ఎందుకంటే ఈ మద్యానికి బానిస అయినవారు ,అవుతున్న వారు కోకొల్లలు .అందువలన ఈ మద్యం వలెనే ప్రభుత్వానికి భారీగా వేల కోట్లు  ఆదాయం రావడం విశేషం .కస్టపడి సంపాదించినా డబ్బుని  తిరిగి  ప్రభుత్వాలకే అప్పజెప్తున్నరు .
          
             
ఇక మనం చెయ్యవలసింది వీలు ఉన్నంత వరకు మద్యాన్ని మానడం -కుటుంబాన్ని కాపాడటం .మన కుటుంబం మన చేతుల్లోనే ఉంది .ఆ కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు .మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే .

Tuesday, 1 August 2017

డబ్బుకు లోకం దాసోహం

                       

        



                 డబ్బే జీవితం  అనే నానుడి ఈనాటి ప్రతి మనిషి  జీవితాలలో ఒక భాగం . ధనం జీవితాన్ని నడిపిస్తుంది అని ఇప్పుడు ప్రతి మనిషి నుంచి వస్తున్నా మాట .మరి ఆ ధనానికి దాసోహం అయ్యేవారు చాలా ఎక్కువ .అది ఎంతలా అంటే మానవ సంబంధాలను  సైతం  దూరం చేసుకునేంత .ఈనాడు ప్రతి ఒక్కరి నుంచి వస్తున్నా మాట ఇది .డబ్బే మూలం డబ్బే ప్రదానం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు .ఈ సూత్రంను  నిజ జీవితం లో జీవితాంతం వరకు ఉపయోగిస్తూ ఉంటారు .మరి అలా ఉంది ఆధునిక జీవితం లో . "ధనం మూలం ఇదం జగత్ " దనమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది అని చెప్పడం లో ఏ సందేహం లేదు .ప్రపంచమంతా డబ్బుకు బానిసగా ఉంది .ఆ డబ్బే ఎన్నో అనర్థాలకు  దారితీస్తోంది. మానవ సంబంధాలను దూరం చెయ్యడం ఒక ప్రధాన కారణం అయితే ,చెడు వ్యసనాలకు బానిస అవ్వడం ఇంకొక కారణం .అయితే డబ్బు ఒక మనిషిని ఎంతగా నాశనం చేస్తుందో ఎవరికీ తెలియనిది కాదు .ఎంత సంపాదించిన ఇంకా కావాలని కోరుకుంటూనే ఉంటాడు .కానీ ఎవరికీ తెలియదు డబ్బు శాశ్వతం కాదు అని.మనిషి శాశ్వతం కాదు డబ్బు కూడా శాశ్వతం కాదు అని మనుషులకి  ఎవరు చెప్తే తెలుస్తుంది .
                           
                           డబ్బు మనిషి నిజాయితీని హరిస్తుంది ,మంచి స్నేహాన్ని చెడగొడుతుంది ,చేదు స్నేహాలకు కృషి చేస్తుంది ,మన సొంత బంధువులని దూరం చేస్తుంది,.అహంకారాన్ని నింపుతుంది ,ధర్మాన్ని నిరోదిస్తుంది .మరి ఇన్ని నష్టాలకు కారణం అయినా డబ్బుకు ఎందుకు దాసోహం అవుతారో ఎవరికీ తెలియదు .అడవులలో ఉన్న జంతువులకు ,పక్షి జాతులకు తెలియదు ఈ డబ్బు ఉందని ,అందుకే అవి చాల అదృష్టం చేసుకున్నాయి కాబట్టే స్వేచ్ఛగా బ్రతుకుతున్నాయి.మరి మానవులు అలా జీవిస్తున్నారా .కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా కనీసం ఒక్క రోజైనా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడా ! మానవ సంబంధాలను కలుపుకుంటున్నాడా  ,తమ పిల్లలు చెడు  వ్యసనాలకు బానిస కాకుండా చేసుకుంటున్నారా  అది వారికే తెలియాలి .డబ్బును వదిలి ప్రేమను పెంచుకుంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు. అలాగని సంపాదించకుండా ఉండమని కాదు .అలా సంపాదిస్తూనే ప్రేమను పెంచుకోమని  ,ప్రేమ ఇద్దర్ని కలుపుతుంది ,ప్రేమ స్నేహాన్ని పెంచుతుంది ,ప్రేమ అందర్నీ దగ్గర చేస్తుంది.ప్రేమ అనేది శత్రుత్వాన్ని దూరం చేస్తుంది ,మరి అలా డబ్బు కన్నా ఎక్కువ విలువ కలిగినది ప్రేమ . 

Friday, 28 July 2017

పల్లెటూళ్ళ అందాలు



                                     ఎప్పటికి తరగని అందాలు ఇప్పటికిచెక్కు చదరని బంధాలు , ఆప్యాయతలు పల్లెల సొంతం . ఎన్నేళ్లు గడిచిన పల్లెతో మనకు ఉన్న బంధం చెదిరిపోనిది . పక్కింటి వాళ్ళ మాటలు , పొరుగు వారి పలకరింపులు (relations) ,ఆప్యాయతలు ,బంధాలు ,బంధుత్వాలు పల్లెల్లో కాక ఇంకెక్కడ ఉంటాయి . ఏవైనా పండుగలు పబ్బాలు వచ్చినా బంధువులతో కలిసి ఉండడం పల్లెల సంప్రదాయం .పట్టణాలతో పోల్చితే చాలా వ్యత్యాసం ఉంటుంది .
 

పట్టణాలలో జీవించే వారి జీవన విధానం లో చాల మార్పులు చోటుచేసుకుంటాయి . ఎవరితోనూ కలుపుగోడులా ఉండడం సాధ్యం కాదు ,ఎవరి పని వారిది అన్నట్లుగా సాగుతుంది . పట్టణాల్లో ఎప్పుడు కూడా భయంతో వారి యొక్క జీవన విధానం ఉంటుంది .వ్యాపారంలో ఘర్షణలు ,దొంగతనాలు ,అఘాయిత్యాలు , మనం ఇప్పుడు చూస్తేనే ఉన్నాం .మాట్లాడుకోవడానికి   కనీసం   ఒక్కరైనా ఉండని దౌర్భాగ్య స్థితి ,ఆప్యాయతలు   ,   పలకరింపులు కూడా కనపడవు .    అదే పల్లెల  విషయానికి వస్తే ఉదయం లేచిన  దగ్గర  నుంచి   సాయంత్రం ప్రొద్దు పోయే వరకు  కూడా  పొరుగు    వారితోనే  కాలం గడిచిపోతుంది . పల్లె ముచ్చట్లు   మురిపిస్తాయి ,అలాగే మైమరిపిస్తాయి కూడా .  
                                     


 తెల్లారిందంటే  చాలు , లేవండి లేవండి అని కూలి వాళ్ళు , ఏదైనా విషయం గురించి చర్చించడానికి రచ్చబండ కార్యక్రమాలు , చుట్టూ ఎత్తైన కొండలు ,వాగులు ,వంకలు ,చుట్టూ అలుముకున్న  పచ్చని వృక్షాలు , వాటికి ఉన్న పిచుక గూళ్లు  ఆహా  ఎంత అనుకున్న కూడా తక్కువే కదా .పట్టణాలు అన్ని పల్లెల నుంచి పుట్టుకు వచ్చినవే అనే నానుడి కూడా ఉంది . ఎప్పటికి కనుమరుగు కానీ అందం పల్లెల సొంతం . ఈ పల్లెలలో నివసించే వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని ఒక మాట .
                          
                            అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే  పల్లెలు పట్టణాలు అవుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేకపోలేదు . ఏవైన పరిశ్రమలను ఏర్పాటు చెయ్యాలన్న కొన్ని ఎకరాల పంటల భూములు నాశనం అవుతున్నాయి ,హోదా కోసం పెద్ద పెద్ద బిల్డింగులు , కాలేజీలు ,కార్పొరేట్ పరిశ్రమలు ,అలా పంటల భూముల్ని నాశనం చేస్తున్నాయి .మనకు ఇన్నాళ్లు కనపడిన పల్లె అందాలు కనపడకుండా నశించిపోతున్నాయి ,పకృతి అంతా కనుమరుగై పోతోంది .అందుకే మన పల్లెల్లో  స్వేచ్ఛగా జీవించాలని కోరుకుందాం .