Friday, 28 July 2017

పల్లెటూళ్ళ అందాలు



                                     ఎప్పటికి తరగని అందాలు ఇప్పటికిచెక్కు చదరని బంధాలు , ఆప్యాయతలు పల్లెల సొంతం . ఎన్నేళ్లు గడిచిన పల్లెతో మనకు ఉన్న బంధం చెదిరిపోనిది . పక్కింటి వాళ్ళ మాటలు , పొరుగు వారి పలకరింపులు (relations) ,ఆప్యాయతలు ,బంధాలు ,బంధుత్వాలు పల్లెల్లో కాక ఇంకెక్కడ ఉంటాయి . ఏవైనా పండుగలు పబ్బాలు వచ్చినా బంధువులతో కలిసి ఉండడం పల్లెల సంప్రదాయం .పట్టణాలతో పోల్చితే చాలా వ్యత్యాసం ఉంటుంది .
 

పట్టణాలలో జీవించే వారి జీవన విధానం లో చాల మార్పులు చోటుచేసుకుంటాయి . ఎవరితోనూ కలుపుగోడులా ఉండడం సాధ్యం కాదు ,ఎవరి పని వారిది అన్నట్లుగా సాగుతుంది . పట్టణాల్లో ఎప్పుడు కూడా భయంతో వారి యొక్క జీవన విధానం ఉంటుంది .వ్యాపారంలో ఘర్షణలు ,దొంగతనాలు ,అఘాయిత్యాలు , మనం ఇప్పుడు చూస్తేనే ఉన్నాం .మాట్లాడుకోవడానికి   కనీసం   ఒక్కరైనా ఉండని దౌర్భాగ్య స్థితి ,ఆప్యాయతలు   ,   పలకరింపులు కూడా కనపడవు .    అదే పల్లెల  విషయానికి వస్తే ఉదయం లేచిన  దగ్గర  నుంచి   సాయంత్రం ప్రొద్దు పోయే వరకు  కూడా  పొరుగు    వారితోనే  కాలం గడిచిపోతుంది . పల్లె ముచ్చట్లు   మురిపిస్తాయి ,అలాగే మైమరిపిస్తాయి కూడా .  
                                     


 తెల్లారిందంటే  చాలు , లేవండి లేవండి అని కూలి వాళ్ళు , ఏదైనా విషయం గురించి చర్చించడానికి రచ్చబండ కార్యక్రమాలు , చుట్టూ ఎత్తైన కొండలు ,వాగులు ,వంకలు ,చుట్టూ అలుముకున్న  పచ్చని వృక్షాలు , వాటికి ఉన్న పిచుక గూళ్లు  ఆహా  ఎంత అనుకున్న కూడా తక్కువే కదా .పట్టణాలు అన్ని పల్లెల నుంచి పుట్టుకు వచ్చినవే అనే నానుడి కూడా ఉంది . ఎప్పటికి కనుమరుగు కానీ అందం పల్లెల సొంతం . ఈ పల్లెలలో నివసించే వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని ఒక మాట .
                          
                            అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే  పల్లెలు పట్టణాలు అవుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేకపోలేదు . ఏవైన పరిశ్రమలను ఏర్పాటు చెయ్యాలన్న కొన్ని ఎకరాల పంటల భూములు నాశనం అవుతున్నాయి ,హోదా కోసం పెద్ద పెద్ద బిల్డింగులు , కాలేజీలు ,కార్పొరేట్ పరిశ్రమలు ,అలా పంటల భూముల్ని నాశనం చేస్తున్నాయి .మనకు ఇన్నాళ్లు కనపడిన పల్లె అందాలు కనపడకుండా నశించిపోతున్నాయి ,పకృతి అంతా కనుమరుగై పోతోంది .అందుకే మన పల్లెల్లో  స్వేచ్ఛగా జీవించాలని కోరుకుందాం .

0 comments:

Post a Comment