అయితే తీర్పు వెలువడటం మాత్రం చాలా ఆలస్యం జరుగుతోంది ఏదైనా కేసుకుసంబంధించిన విషయమై వాయిదాలు వేస్తూ ఉండటం ఒక కారణం కావచ్చు.ఎప్పుడో మొదలైన ఒక కేసు విషయం అది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలీదు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి చూసి విసిగి పోయే అవకాశం కనపడుతూ ఉంటుంది .అన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగలేక, కేసులు విత్డ్రా చేసుకునే వారూ లేకపోలేదు.మరికొంత మందైతే గనుక సాధారణ మరణానికి చేరువయ్యే వారు ఉన్నారు.ఈ విధంగా తీర్పు కోసం ఎదురు చూసే వారు ,తీర్పు వెలువడే నాటికి ,అప్పటికీ ఎవరు ఉంటారో, ఎవరు పోతారో ఎవరికీ తెలీదు.
ప్రస్తుత రోజుల్లో అయితే దీనిని సాకుగా చేసుకుని నేరాలు, ఘోరాలు ఎక్కువవుతున్నాయి .ఏదో ఒక విషయమై మనషులను చంపడంలోనూ వెనుకాడడం లేదు.ఇప్పట్లో అతి చిన్న గొడవ హత్యలకు దారితీస్తోంది . మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి దొంగతనాలు చేసేవారు మితిమీరిపోతున్నారు.
వారు చాలా దీమాతో చేస్తున్నారు. అటువంటి వారిపై కేసు నమోదు చేసినా కూడా,మళ్లీ అలాంటివే చేస్తారు,కోర్టులో దీనికి సంబంధించిన కేసు ఉంటుంది, కానీ అది తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి .వెంటనే వారికిబెయిల్ కూడా వస్తుంది.ఆ కేసులో పెండింగ్లో ఉండగానే మళ్లీ నేరాలు చేస్తారు .మళ్ళీ కేసు అవుతుంది ,ఇక షరా మామూలే.ఆ తీర్పు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్లీ బెయిల్ వస్తుందిఈ విధంగా జరుగుతున్న ప్రాసెస్ వారికి అనుకూలంగా మారుతోంది.
ఈ సమాజంలో నేరాలు ఘోరాలు చేసే వాళ్లే ధీమాతో చేస్తున్నారు. చేసిన తప్పుకు తొందరగా శిక్ష కూడా పడటం లేదు. ఏ నేరం చేసినా వెంటనే బెయిల్ కూడా వస్తున్న నెపంతో తప్పు మీద తప్పు చేస్తున్నారు.అందువల్లే ఈ సమాజంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక కొంతమందైతే అధికార పార్టీ ప్రతినిధులను కలుస్తారు . ఇక ఆ తర్వాత మామూలే, కేసును తప్పుదోవ పట్టిస్తారు.ఈ విధంగా జరిగేవి కోకొల్లలు .చేసిన తప్పుకు శిక్ష ఎంతమందికి పడుతోంది? ఒకరికి జరిగిన అన్యాయానికి వెంటనే శిక్ష పడదా? నేరానికి బలైన వారి పరిస్థితి ఏంటి ?వారు కోర్టులు చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరగాలి? అయితే నేరాలకు పాల్పడే వారికి బెయిలు తొందరగా మంజూరు చేయకూడదు అని ప్రతి ఒక్కరి మాట.
నేరాలకు,అన్యాయాలకు బలైన వారి బాధ ఎవరికి తెలుస్తుంది?ఎవరు పట్టించుకుంటారు ?ఈ సమాజంలో మనుష్యులు రాతిమనుషులుగా మారుతున్నారు కానీ, చట్టాలు మాత్రం కఠినంగా ఉండటం లేదు.చట్టాలు మారడం ఈ సమాజానికి ఇప్పట్లో చాలా అవసరం .నేరాలకు, అన్యాయాలకు పాల్పడేవారిని వణుకు పుట్టించే చట్టాలు రావాలి .ఒక్క సౌదీలోనే ఇప్పటి వరకు ఉన్న కఠినమైన చట్టాలు, అక్కడ ఏ నేరం చేయాలన్న అక్కడి ప్రజలుభయపడతారు .అక్కడి చట్టా లు అంత కఠినంగా ఉంటాయి మరి.అదే విధంగా మన ఇండియాలో కూడా అలాంటి చట్టాలు రావాలని మనం కోరుకుందాం.ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థే మార్గదర్శి.అయితే న్యాయ వ్యవస్థ ఎవరినీ వదిలి పెట్టదు.
0 comments:
Post a Comment