ఈ చరాచర సృష్టికి మూల కారణమైన తల్లిదండ్రులు ఎంతో గొప్పవాడు. తల్లిదండ్రులు లేని జీవకోటికి మనుగడ లేదు. మనం దేవుని ఎంతగానోప్రార్థిస్తాం, చాలా కోరికలు కోరుకుంటాం. మరి మనకు కావలసిన కోరికలను నెరవేర్చే తల్లిదండ్రులను మాత్రం ప్రార్థించడం ఎందుకు ? , అలాగే మన సృష్టికి మూలకారణమైన తల్లిదండ్రులను ఆరాధించం. మనకు అన్నీ ఇచ్చే మన తల్లిదండ్రులను గాక, ఏమీ ఇవ్వని భగవంతుడిని ప్రార్థిస్తారు .కానీ ఒకసారి ఆలోచిస్తే మనకు అన్నీ ఇచ్చే ఆ తల్లిదండ్రులను ఇచ్చింది ఆ భగవంతుడే కదా.అది మాత్రం ఎవరూ తెలుసుకోవడం లేదు.
ఆ భగవంతుడు మనం ఏ వరం కోరుకోకుండానే తల్లిదండ్రులను ఇచ్చాడు.మన సృష్టి కారణం వారే కదా. మన యొక్క అవసరమైన ప్రతి కోరికలను తీరుస్తారు .కానీ తల్లిదండ్రులను మాత్రం పూజించక పోగా,కనీసం గౌరవించరు.బాగా ఆలోచిస్తే, భగవంతుడు మన తల్లిదండ్రులను రూపంలోనే ఉంటాడని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది
సాక్షాత్తు ఆ భగవంతుడే అంటాడు" నేను మీకు తల్లిదండ్రులను ఇచ్చాను. మీ సృష్టికి గల కారణం వారే కదా. మీరు కోరిన కోరికలు తీర్చే తల్లిదండ్రులను నేను ఇచ్చాను.కానీ మీరువారిని మరిచిపోతున్నారు .మీకు ఉన్నటువంటి అజ్ఞానంతో దానిని గమనించడం లేదు.ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమించాలి. భగవంతుడిగా నేను సైతం కోరుకునేది అదే కదా.పరమాత్మ ఎక్కడో లేడు తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నాడు .దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి" . ఈ విధంగా ఆ భగవంతుడే అంటాడు.
ప్రస్తుత కాలంలో అయితే తల్లిదండ్రులను ఆరాధించేవారు కనుమరుగై పోతున్నారు .మనమెంతో ఆప్యాయంగా అల్లారు ముద్దుగా పెంచిన వారికి, బహుమతిగా ఇంటి నుంచి వెలివేస్తున్నారు .మనం ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా తెచ్చిచ్చేవారు,చివరికి వారి జీవితం ఎడారిలా మారిపోతోంది .వారు జీవించి ఉన్నంత వరకు పిల్లల శ్రేయస్సునే కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి కావలసిన,కోరుకున్న జీవితాన్ని కూడా అందిస్తారు.ఏం కోరుకున్నా ఇవ్వని భగవంతుడ్ని చాలా కోరుకుంటాం , కానీ మరి అన్నీ ఇచ్చే మన తల్లిదండ్రులను మాత్రం గుర్తించం. మరి ఏమీ ఇవ్వని ఆ భగవంతుడిని దేవుడిగా నమ్మినప్పుడు మనకు అన్ని ఇచ్చే తల్లిదండ్రులు కూడా దేవుళ్లతో సమానమే కదా! వారూ ఆ పరమాత్మతో సమానమే కదా ! వారు ఎంతో కష్టపడి మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనే వారి ఆశ మహోన్నతమైనది .చాలా గొప్ప మనసు కలవారు, అందుకే ఆ భగవంతుడే మనకు తల్లిదండ్రులను ఇచ్చాడు , ప్రతి ఒక్కరూ దీనిని ఆలోచించాలి.
ప్రస్తుత కాలంలో అయితే తల్లిదండ్రులను ఆదరించేవారు కరువైపోతున్నారు. ఎంతో ప్రేమతో మనల్ని పెంచి పోషించిన వారికి ఆదరాభిమానాలు కరువైపోతున్నాయి .ప్రస్తుతం చూస్తే రోజురోజుకు తల్లిదండ్రులను వదిలించుకున్న వారు ఎక్కువైపోతున్నారు. నానాటికీ old Age Homes వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి .మన కలల్ని సాకారం చేసిన వారికి బహుమతిగా వృద్ధాశ్రమాలలో వదిలిపెడుతున్నారు .ఇది ఎంత వరకు న్యాయం .
ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన కూడా ఓల్డ్ ఏజ్ హోం Old Age Homes లలో వృద్ధుల సంఖ్య పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రులు వృద్ధులు అయ్యాక ,వారిని భారంగా చూస్తున్నారు. వీటిసంఖ్య చాలా ఎక్కువగా ఉండటం విశేషం. మరికొంత మందైతే హోల్డ్ ఏజ్ హోమ్స్ old Age Homes లలో వదలక పోగా, ఎక్కడో ఒక చోట వదిలిపెడుతున్నారు. మరికొంత మంది అయితే స్మశాన వాటికల్లో అనాథలా వదిలిపెడుతున్నారు. ఇది చాలా బాధాకరం.
ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పులు రావాల్సి ఉంది. చిన్నతనంలో తమ తల్లిదండ్రులు ఏ విధంగానైతే ప్రేమించారో, ఆ విధంగా తమ తల్లిదండ్రులనూ ప్రేమించే విధంగా ఉండాలి. తల్లిదండ్రులను చూడటం ఒక భారంగా అనుకోకూడదు .తల్లిదండ్రులను ప్రేమిస్తే, ఆ భగవంతుడిని ప్రార్థించినట్టే .
0 comments:
Post a Comment