Sunday, 1 April 2018

మానవత్వం అంతరించిన వేళ

 


     మానవత్వం అనేది ప్రతి   ఒక్కరికీ  ఉంటుంది. మానవత్వం ఉంటే కనుక   ఎవరి   జీవితమైనా ఆనందంగా ఉండడానికి   కారణం అవుతుంది. అసలు మానవత్వానికి ముగింపు లేదనే చెప్పవచ్చు . ఎప్పటికీ    ఉండదు   కూడా.    ఒక మనిషిలో మానవత్వం అనేది  ఎప్పుడు పడుతుందంటే, ఎవరైనా ఆపదలో ఉన్నపుడు, ఎవరికైనా సహాయ సహకారాలు అవసరమైనపుడు     మానవత్వం పుడుతుంది. మానవత్వం అనే పదాన్ని దేవుడిచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. సగటు మనిషికి కష్టం వస్తే ఆదుకునే అవకాశం ఎంతో పుణ్యానికి నాందిగా పేర్కొనవచ్చు .



అయితే ప్రస్తుతం చూస్తే మానవత్వం అనే పదం అంతరించిపోయిందని     చెప్పాలి.    ప్రస్తుత సమాజంలో మానవత్వాన్ని  ఇంచుకైనా ఎక్కడా కనపడదు. ఎంతో టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో    ఆ టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆ టెక్నాలజీకి అలవాటు    పడుతున్నారే    తప్ప ,ఇతరులకు సాయం చేయాలనే మాట గతి తప్పింది. సహాయం కోరవచ్చని వారిని చులకనగా చూడడమే తప్ప  వారి యొక్క దీనావస్థను   ఎవరూ   అర్థం చేసుకోరు.ఇక ఆపదల్లో ఉన్న వారికి సైతం సాయం చేయకపోవడం గమనార్హం.

     ప్రస్తుతం అయితే ఎవరైనా ఆపదలలో  ఉండి సహాయం కోరినా పట్టించుకోవజం లేదు.   వారి యొక్క ఆర్తనాదాలను  ఎవరూ   వినిపించుకోరు.     ఆ సమయంలో ప్రక్కనే  ఎంతో మంది    ఉన్నా కనికరించే వారే లేరే  అనే వారి బాధ వర్ణనాతీతం. మొబైల్ ఫోన్స్ తో వీడియోలు చేసుకుంటారే గాని, కొంచెం సాహాయం చేయాలనే     ఆలోచన కూడా ఎవరికీ రాదు. రేపు మన పరిస్థితి ఇలాగే వస్తే ఏంటి ! అని ఎవరూ ఆలోచించడం లేదు.



  అదే విధంగా రోడ్లపై ఎంతోమంది బిచ్చగాళ్ళు ఉంటున్నారు. మరియు ప్రతి దేవుళ్ల గుడి వద్ద కూడా ఎంతోమంది ఉంటారు. కనీసం వారిని    ఆదుకునే వారే కరువయ్యారు.   ప్రస్తుతం ప్రతి   సంవత్సరం చూసుకుంటే వారి    జనాభా    పెరుగుతుండటం విశేషం. ఎన్నుకున్న    ప్రభుత్వాలు   మారుతున్నా బిచ్చగాళ్ల జీవితాలు మారడం లేదు.కనీసం వారి  పిల్లలను సైతం బిక్షాటన చేయిస్తుండటం బాధాకరం .పసి హృదయాలు రోడ్లపై భిక్షాటన చేస్తున్నారు.


 
  అసలు మానవత్వం అనేది ఎక్కడా కనిపించడం లేదు.     ప్రతి మనిషి    తన   జీవితం    మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నాడు గానీ ,ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన కూడా రాదు, ప్రస్తుతం ప్రతి మనిషిలోఎవరు ఎటు పోతే   నాకేంటి! అనే స్వార్థం   పెరిగిపోతోంది.     చూసి      చూడనట్లు వ్యవహరిస్తున్నారు     గానీ,     తమ  స్వార్థాన్ని మాత్రంవిడిచి పెట్టడం లేదు.

   భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎంతో    జ్ఞానాన్ని ఇచ్చాడు.దానిని   మంచి   మార్గంలో   గాక, చెడు మార్గంలో         ఉపయోగించుకుంటున్నారు. భగవంతుడిచ్చిన     జ్ఞానాన్ని స్వార్థంతో  నింపేసుకోవడం   అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

0 comments:

Post a Comment