డబ్బే జీవితం అనే నానుడి ఈనాటి ప్రతి మనిషి జీవితాలలో ఒక భాగం . ధనం జీవితాన్ని నడిపిస్తుంది అని ఇప్పుడు ప్రతి మనిషి నుంచి వస్తున్నా మాట .మరి ఆ ధనానికి దాసోహం అయ్యేవారు చాలా ఎక్కువ .అది ఎంతలా అంటే మానవ సంబంధాలను సైతం దూరం చేసుకునేంత .ఈనాడు ప్రతి ఒక్కరి నుంచి వస్తున్నా మాట ఇది .డబ్బే మూలం డబ్బే ప్రదానం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు .ఈ సూత్రంను నిజ జీవితం లో జీవితాంతం వరకు ఉపయోగిస్తూ ఉంటారు .మరి అలా ఉంది ఆధునిక జీవితం లో . "ధనం మూలం ఇదం జగత్ " దనమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది అని చెప్పడం లో ఏ సందేహం లేదు .ప్రపంచమంతా డబ్బుకు బానిసగా ఉంది .ఆ డబ్బే ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది. మానవ సంబంధాలను దూరం చెయ్యడం ఒక ప్రధాన కారణం అయితే ,చెడు వ్యసనాలకు బానిస అవ్వడం ఇంకొక కారణం .అయితే డబ్బు ఒక మనిషిని ఎంతగా నాశనం చేస్తుందో ఎవరికీ తెలియనిది కాదు .ఎంత సంపాదించిన ఇంకా కావాలని కోరుకుంటూనే ఉంటాడు .కానీ ఎవరికీ తెలియదు డబ్బు శాశ్వతం కాదు అని.మనిషి శాశ్వతం కాదు డబ్బు కూడా శాశ్వతం కాదు అని మనుషులకి ఎవరు చెప్తే తెలుస్తుంది .
డబ్బు మనిషి నిజాయితీని హరిస్తుంది ,మంచి స్నేహాన్ని చెడగొడుతుంది ,చేదు స్నేహాలకు కృషి చేస్తుంది ,మన సొంత బంధువులని దూరం చేస్తుంది,.అహంకారాన్ని నింపుతుంది ,ధర్మాన్ని నిరోదిస్తుంది .మరి ఇన్ని నష్టాలకు కారణం అయినా డబ్బుకు ఎందుకు దాసోహం అవుతారో ఎవరికీ తెలియదు .అడవులలో ఉన్న జంతువులకు ,పక్షి జాతులకు తెలియదు ఈ డబ్బు ఉందని ,అందుకే అవి చాల అదృష్టం చేసుకున్నాయి కాబట్టే స్వేచ్ఛగా బ్రతుకుతున్నాయి.మరి మానవులు అలా జీవిస్తున్నారా .కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా కనీసం ఒక్క రోజైనా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడా ! మానవ సంబంధాలను కలుపుకుంటున్నాడా ,తమ పిల్లలు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చేసుకుంటున్నారా అది వారికే తెలియాలి .డబ్బును వదిలి ప్రేమను పెంచుకుంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు. అలాగని సంపాదించకుండా ఉండమని కాదు .అలా సంపాదిస్తూనే ప్రేమను పెంచుకోమని ,ప్రేమ ఇద్దర్ని కలుపుతుంది ,ప్రేమ స్నేహాన్ని పెంచుతుంది ,ప్రేమ అందర్నీ దగ్గర చేస్తుంది.ప్రేమ అనేది శత్రుత్వాన్ని దూరం చేస్తుంది ,మరి అలా డబ్బు కన్నా ఎక్కువ విలువ కలిగినది ప్రేమ .