Saturday, 24 February 2018

న్యాయ వ్యవస్థే మార్గదర్శి




      ఇండియాలో న్యాయ వ్యవస్థ ఒక గొప్ప న్యాయ వ్యవస్థగా పేరుగాంచింది.న్యాయ వ్యవస్థ ఎప్పటికీ న్యాయంగా ఉంటుంది కూడా.అదే విధంగా ప్రజలు కూడా అనుకుంటారు .దేశమంతా న్యాయ వ్యవస్థకు కట్టుబడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి న్యాయం కావాలనే విధానం న్యాయ వ్యవస్థది. కాబట్టే న్యాయమన్నది న్యాయస్థానంలో అంతర్గతంగా ఉంది .ఏ అధికారం కలిగిన వ్యక్తి కూడా న్యాయవ్యవస్థ నుంచి తప్పించుకోలేడు చట్టానికి ఉన్న కళ్లను మూయించలేరు . ఆ విధంగా మన ఇండియాలో న్యాయవ్యవస్థ ప్రసిద్ధిగాంచింది.
         
            అయితే తీర్పు వెలువడటం మాత్రం చాలా  ఆలస్యం జరుగుతోంది ఏదైనా కేసుకుసంబంధించిన విషయమై వాయిదాలు వేస్తూ ఉండటం ఒక కారణం కావచ్చు.ఎప్పుడో మొదలైన ఒక కేసు విషయం అది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలీదు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి చూసి విసిగి పోయే అవకాశం కనపడుతూ ఉంటుంది .అన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగలేక, కేసులు విత్డ్రా చేసుకునే వారూ లేకపోలేదు.మరికొంత మందైతే గనుక సాధారణ మరణానికి చేరువయ్యే వారు ఉన్నారు.ఈ విధంగా తీర్పు కోసం ఎదురు చూసే వారు ,తీర్పు వెలువడే నాటికి ,అప్పటికీ ఎవరు ఉంటారో, ఎవరు పోతారో ఎవరికీ తెలీదు.
             
                 ప్రస్తుత రోజుల్లో అయితే దీనిని సాకుగా చేసుకుని నేరాలు, ఘోరాలు ఎక్కువవుతున్నాయి .ఏదో ఒక విషయమై మనషులను చంపడంలోనూ వెనుకాడడం లేదు.ఇప్పట్లో అతి   చిన్న గొడవ హత్యలకు   దారితీస్తోంది .     మహిళలపై అఘాయిత్యాలు    ఎక్కువ     అవుతున్నాయి దొంగతనాలు చేసేవారు       మితిమీరిపోతున్నారు.
వారు చాలా దీమాతో చేస్తున్నారు.   అటువంటి వారిపై కేసు   నమోదు    చేసినా కూడా,మళ్లీ అలాంటివే చేస్తారు,కోర్టులో దీనికి సంబంధించిన కేసు ఉంటుంది, కానీ అది తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి .వెంటనే వారికిబెయిల్ కూడా వస్తుంది.ఆ కేసులో పెండింగ్లో ఉండగానే మళ్లీ నేరాలు చేస్తారు .మళ్ళీ కేసు అవుతుంది ,ఇక షరా మామూలే.ఆ తీర్పు కూడా ఎప్పుడు    వస్తుందో తెలియదు. మళ్లీ బెయిల్ వస్తుందిఈ విధంగా జరుగుతున్న ప్రాసెస్    వారికి     అనుకూలంగా మారుతోంది.
           
              ఈ సమాజంలో నేరాలు ఘోరాలు చేసే వాళ్లే ధీమాతో చేస్తున్నారు. చేసిన    తప్పుకు తొందరగా శిక్ష కూడా పడటం లేదు. ఏ నేరం చేసినా వెంటనే బెయిల్ కూడా  వస్తున్న నెపంతో తప్పు మీద తప్పు చేస్తున్నారు.అందువల్లే ఈ సమాజంలో నేరాలు      ఎక్కువగా     జరుగుతున్నాయి. ఇక కొంతమందైతే అధికార పార్టీ ప్రతినిధులను కలుస్తారు . ఇక ఆ తర్వాత మామూలే, కేసును     తప్పుదోవ పట్టిస్తారు.ఈ విధంగా జరిగేవి కోకొల్లలు .చేసిన తప్పుకు శిక్ష ఎంతమందికి పడుతోంది? ఒకరికి జరిగిన అన్యాయానికి వెంటనే శిక్ష పడదా? నేరానికి బలైన వారి పరిస్థితి ఏంటి ?వారు కోర్టులు చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరగాలి? అయితే నేరాలకు పాల్పడే వారికి బెయిలు తొందరగా మంజూరు చేయకూడదు అని ప్రతి ఒక్కరి మాట.
               
                    నేరాలకు,అన్యాయాలకు బలైన వారి బాధ ఎవరికి తెలుస్తుంది?ఎవరు పట్టించుకుంటారు ?ఈ సమాజంలో మనుష్యులు రాతిమనుషులుగా మారుతున్నారు కానీ, చట్టాలు మాత్రం కఠినంగా ఉండటం లేదు.చట్టాలు మారడం ఈ సమాజానికి ఇప్పట్లో చాలా అవసరం .నేరాలకు, అన్యాయాలకు పాల్పడేవారిని  వణుకు పుట్టించే చట్టాలు రావాలి .ఒక్క సౌదీలోనే ఇప్పటి వరకు ఉన్న కఠినమైన చట్టాలు, అక్కడ    ఏ నేరం చేయాలన్న    అక్కడి ప్రజలుభయపడతారు .అక్కడి చట్టా లు   అంత కఠినంగా ఉంటాయి మరి.అదే విధంగా మన ఇండియాలో కూడా అలాంటి చట్టాలు రావాలని మనం కోరుకుందాం.ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థే మార్గదర్శి.అయితే న్యాయ వ్యవస్థ ఎవరినీ వదిలి పెట్టదు.

Thursday, 22 February 2018

వివాహ బంధానికి సంకెళ్లు




             మన ఇండియాలో వివాహ బంధానికి ఉన్న ప్రాధాన్యత ఏ ప్రపంచ దేశానికి లేదు.ఎందుకంటే వివాహ బంధం అనేది మన ఇండియాలో ఒక గొప్ప సంప్రదాయంగా భావిస్తారు.దానికి ప్రతి ఒక్కరూ ఎంతో ప్రాధాన్యతనిస్తారు.పురాతన కాలం నుంచి మన ఇండియాలో ఒక వివాహ వ్యవస్థ అనేది ఒక సంప్రదాయంగానూ ఉంది.ఆ వివాహ బంధానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే.అటు అమ్మాయి తరుపు వారు, ఇటు అబ్బాయి తరపు వారు ఈ పద్ధతిని పాటించాల్సిందే.ఇక అమ్మాయి తరపు వారైతే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకుంటు ఉంటారు.వివాహ బంధం అనేది ఇద్దరి జీవితాలకు సంబంధించినది.జీవితాంతం ఇద్దరు కలిసి ఉండే మార్గంగా చెప్పవచ్చు.జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ప్రయాణించడానికి నిర్దేశించింది.వివాహం తర్వాత అటు అమ్మాయి తరుపు వారు. ఇటు అబ్బాయి తరుపు వారు పిల్లా పాపలతో యోగక్షేమాలతో కలిసి జీవించండి అని,వారి యొక్క ఆశీర్వచనాలు అందించడం జరుగుతుంది.ఇక వారిద్దరి వివాహము స్వర్గంలో రాసి పెట్టిందని ప్రతి ఒక్కరూ అంటుంటారు.ఏ కష్టమొచ్చినా కన్నీళ్లొచిన వారిద్దరే భరించాలి.

                  అదే విధంగా ఒక భర్త ఇంటికి ఒక యజమానిగా ఉండి, తన భార్యకు మరియు పిల్లలను జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకోవాలనె చింతన ఉంటుంది.అదే విధంగా వారికి ఒక బాడీగార్డుగాను కంటికి రెప్పలా కాపాడుతూ జీవితాంతం తోడుగా ఉంటాడు. అది తన బాధ్యతగా భావిస్తాడు.మరి అంతటి వివాహ బంధానికి ప్రాధాన్యతను ఇస్తూ మరియు కుటుంబానికి ఎంతో కృషి చేస్తుంటాడు.అయితే కొంతమంది ఆడవాళ్ళు మాత్రం తమ వివాహ బంధానికి విలువ లేకుండా చేసుకుంటున్నారు. వివాహ బంధానికి ఉన్న ప్రాముఖ్యతను రూపు మాపుతున్నారు.అటు వివాహ బంధానికి ,ఇటు భర్తకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.భారతదేశం సంప్రదాయబద్ధంగా గొప్ప దేశంగా మారుతున్న ఈ తరుణంలో మహిళలు వివాహ బంధానికి విలువ ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోంది.ప్రధానంగా ఆచార వ్యవహారాలను వారి నుంచే నేర్చుకోవాలి.కానీ వారే ఇటువంటి పనులను చేస్తుండడం బాధ కలిగించే విషయం.జీవితాంతం తోడు,నీడలా ఉండే తన భర్త పట్ల ఏ మాత్రం గౌరవం చూపించడం లేదు.
         ఇక భర్త చనిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికంటే,భర్త ఉండి అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.ఇది అందరినీ తీవ్ర ఆందోళన కలిగించే విషయం.ఇక పెళ్లికి ముందు ఉండే పరాయి వ్యక్తులతో ఉన్న సంబంధాలు పెళ్లి తర్వాత కూడా కొనసాగిస్తుండటం విశేషం.వివాహ బంధాన్ని దానిని ఒక ఆటలో అరటిపండులా ఉపయోగించుకుంటున్నారు.తన కుటుంబం కోసం ఎంతో చేసే తన భర్తను గురించి,తమ పిల్లల గురించి ఆలోచించడం లేదు.

         
               ఈ రోజుల్లో అయితే మరీ ఎక్కువగా అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి.అది ఎంతగా అంటే భర్తను చంపేయాలనే ఆలోచన వచ్చేంత.భర్తను సైతం ప్రియుడితో కలిసి చంపడం బాధ కలిగించే విషయం.వారు అటు వివాహ బంధానికి విలువ ఇవ్వకపోగా, ఇటు భర్తకు కూడా విలువ ఇవ్వకపోవడం గమనార్హం .ఇక పిల్లల సంగతి ఏమిటి? తమ రూపురేఖలతో పుట్టిన పిల్లల గురించి కూడా ఆలోచన లేదు.అసలు పిల్లలు పుట్టకుండా ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. పిల్లలు పుట్టని వారికే తెలుసు ఆ బాధ.మరి పిల్లలు పుట్టి వారిని వదిలేయడం ఎంతవరకు సబబు.మరి పిల్లలు పుట్టకుండా ఉంటే ఆ భగవంతున్ని సైతం గుర్తు చేసుకుంటారు. ఏ చీకు, చింత లేకుండా ప్రియుడితో జల్సాలు చేస్తుండటం విశేషం.మరీ దారుణమైన విషయమేంటంటే భర్తలను చంపడం.ప్రస్తుతం ఇవి చాలా చోట్ల జరుగుతున్నాయి .ఏ తప్పు చేయని భర్తకు మరణ శిక్ష?.ఇది తలుచుకుంటేనే బాధ కలిగించే విషయం. తన కష్టాన్నంతా తన కుటుంబం కోసమే చేస్తాడు. తను చనిపోయే వరకు కుటుంబ బాధ్యతలు మోస్తూనే ఉంటాడు.కానీ కొంతమంది మహిళలు మాత్రం అలా ఆలోచించడం లేదు.

            
              ఒక సంవత్సరంలో, అక్రమ సంబందానికి సంబంధించిన హత్యలు కూడా పెరుగుతుండటం గమనార్హం.ఈ విధంగా చేసే ఆడవారి వల్ల, వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఆడవారికి కూడా పేరును తీసుకొస్తున్నారు.కొంతమంది మహిళలు వివాహ బంధానికి ఎంతోప్రాధాన్యతను ఇస్తుంటే, మరి కొంతమంది మహిళలు వివాహ బంధానికి ఉన్న ప్రాధాన్యతను తుడిచివేస్తున్నారు.ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే ,భవిష్యత్తులో వివాహ బంధం అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.సంస్కృతి సంప్రదాయాలలో ఇండియా ఒక గొప్ప దేశంగా ఎదుగుతోందని, ఇండియాలోని వివాహబంధానికి చాలా ప్రాముఖ్యత ఉందని ప్రపంచ దేశాలన్నీ సంస్కృతి సంప్రదాయల కోసం ఇండియా వైపు చూస్తున్నాయని,అందువల్ల ఇండియాకు ప్రపంచ దేశాలు చాలా ప్రాముఖ్యత నిస్తున్నాయని తత్వవేత్తలు కూడా అంటున్నారు.అంత గొప్ప దేశంగా ఉన్న మన దేశానికి వివాహ బంధం ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది.

                    ఇక చివరగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ వివాహ బంధానికి విలువ ఇవ్వవలసిన అవసరం ఉంది.భార్యకు తోడుగా భర్త, భర్తకు తోడుగా భార్య జీవితాంతం కలిసి మెలిసి ఉండాలనే ఆశయం ఉండాలి.ఇండియాలో ఉన్న వివాహ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉంది.ప్రతి భర్త నా భార్య నా సర్వస్వం అని,ప్రతి భార్యా నా భర్తే దైవమని అనుకునే రోజులు రావాలి.అప్పుడే మన వివాహ వ్యవస్థ పటిష్టమవుతుంది.
 "పిల్లల సంతోషమే తల్లిదండ్రుల సంతోషం, భార్య సంతోషమే భర్త సంతోషం".