Saturday, 3 March 2018

దోచుకున్న వాళ్ళకు దోచుకున్నంత




       డాక్టరు ను భగవంతుడు  అంటారు.వారిని భగవంతుడితో       పోలుస్తారు.       ప్రాణాలను కాపాడటానికి వచ్చిన భగవంతుడు అంటారు . మరి అలాంటి స్థాయిని కలిగినటువంటి వారు అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నారు.కొత్త ఆలోచనలకు పునాది వేస్తున్నారు.సాధారణ కాన్పు చేయాల్సిన దానికి  కత్తెరలతో    కోత      (సిజేరియన్)
పెడుతున్నారు.అక్రమ దందా వైపు అడుగులు వేస్తున్నారు.సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నా కూడా ,సాధారణ కాన్పు చేయకుండా ఆపరేషన్లను చేస్తున్నారు .
   
               ప్రస్తుతమైతే ప్రతి 100 లో 90 మందికి ఆపరేషన్లు చేస్తుండటం గమనార్హం.ప్రజలు ఒక డాక్టరును దేవుడిగా పూజిస్తారు. కానీ ,ఆ డాక్టర్లు మాత్రం అలా అనుకోవట్లేదు.డబ్బే ప్రధానంగా చూసుకుంటున్నారు ఒక ఆపరేషన్ కు వేలు, లక్షల్లో వసూలు  చేస్తున్నారు .అవసరం లేకున్నా కూడా ఆపరేషన్స్ చేయడం వలన కొన్నిసార్లు,ఆ గాయం మూలానా అటు తల్లికి గానీ, ఇటు బిడ్డకు గాని ప్రమాదంతో చనిపోతుండడం విశేషం. ఒక వేళ తల్లికి గాని, బిడ్డకు గాని ఏదైనా ప్రమాదం సంభవిస్తే, అప్పుడు కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రజలు లక్షల్లో డబ్బు పెట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎలాగో అప్పు చేసి కట్టినా కూడా, తల్లి బిడ్డకు ప్రమాదం సంభవించి ఏదైనా జరిగితే ఇక అంతే సంగతులు.
       
               
           ఇక భార్యాభర్తలు అయితే డాక్టర్లు ఏం చెబితే అదే వింటారు. తప్పదు కూడా. బిడ్డ అడ్డం తిరిగింది లేదా తల్లికి ప్రమాదంగా ఉందని, ఏదో ఒక సాకుతో ఆపరేషన్      చేయాలని     నమ్మకం కలిగిస్తున్నారు  .   కానీ ఆ భర్త , తాను తండ్రి కాబోతున్నాడన్న ఆనందంతో డాక్టర్ ఏం చెప్పినా సరే అంటాడు .ఇక బంధువులు కూడా అంతే. డాక్టర్లు నమ్మకంగా నమ్మిస్తారు.సాధారణ కాన్పు కోసం హాస్పిటల్కు వెళితే అది ఆపరేషన్గా మారిపోతుంది. కత్తెరతో కోత పెడతారు. ఇలా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆపరేషన్లు చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు .డాక్టర్లే దేవుళ్లు అన్ని నమ్మిన ప్రజాలోకానికి  కొన్ని కార్పొరేట్ హాస్పటల్లో తమ నమ్మకాన్ని పెంచుకుంటూ, దోపిడీ చేస్తుండటం గమనార్హం.
   
             ఒకప్పుడు ఆపరేషన్లు 10 శాతంగా ఉండేది .కానీ ఇప్పుడు 30 శాతానికి పెరిగింది. దేశంలో ప్రతి 100 మందిలో 90 మందికి సిజేరియన్ జరుగుతోంది .   కత్తెర    కోతలతో     ప్రతి       గంటకు     ఐదుగురు చనిపోతుండటం    విశేషం.   ఈ విధంగా     కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలు వ్యాపారం చేస్తూ లక్షల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రసవంఎంతో మంచిదని ప్రచారం చేసినా ,     ప్రజలు    దానిపై నమ్మకం ఉంచడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్కి క్యూ కట్టడం విశేషం.

Thursday, 1 March 2018

గొప్ప దేశంగా ఇండియా


          ఇండియా ఒక గొప్ప దేశంగా ప్రతి ఒక్కరు భావిస్తారు. ఎందుకంటే ఇండియా సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక."భిన్నత్వంలో ఏకత్వం" గల ఏకైక దేశం. ఆచారవ్యవహారాలకు పుట్టినిల్లు. భారతదేశంలో ఉన్న అన్ని మతాలు మరియు అన్ని వర్గాలు వేర్వేరు మరియు ఏకైక సంస్కృతులకు సమిష్టిగా సూచిస్తుంది.భారతదేశం యొక్క భాషలు, మతాలు, నాటక రంగం సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు అనేవి భిన్నంగా ఉంటాయి.భారతీయ సంస్కృతి అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలవబడుతున్నది .ఇది భారత ఉపఖండంలో విస్తరించి ఉంది. మరియు అనేక వేల సంవత్సరాల వయస్సు కలిగిన చరిత్రగా మనకు చూపబడుతోంది.

      ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపేవి:

1) భారతీయ మతాలు
2) భారతీయ వంటకాలు
3) నాటక రంగం
4) ఆచార వ్యవహారాలు
5) సంస్కృతి సంప్రదాయాలు
6)భిన్నత్వంలో ఏకత్వం
7)ఏకధాటిపై ఉండటం
8)భక్తి ఆ పారవశ్యత
ఇవన్నీ ప్రపంచ దేశాలు సైతం ఇండియాను వైపు చూడటానికి ప్రభావితం చేస్తున్నాయి.ఇండియా ఒక చారిత్రాత్మక గొప్ప దేశంగా ప్రసిద్ధి గాంచింది.
         

Culture:

   భారత దేశం వివిధ సంస్కృతి మరియు నాగరికతలతో 29  రాష్ట్రాలు కలిగి ఉంది .ఈ మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి.భారతీయ చరిత్ర మొత్తంలో భారతీయ సంస్కృతి ధార్మిక మతాల చే బాగా ప్రభావితమైంది .వారు భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం ,వాస్తు శిల్పం, కళ మరియు సంగీతం యొక్క చాలా ఆకృతిని రూపొందించారు.ప్రత్యేకించి హిందూమతం,బౌద్ధమతం ,వాస్తు శిల్పం పరిపాలనా మరియు లేఖన వ్యవస్థ భారతదేశం నుండి ఆసియాలోని ఇతర భాగాలకు సిల్కు రోడ్డు ద్వారా ప్రయాణికులు మరియు సముద్ర వ్యాపారుల ద్వారా తొలి శతాబ్దాలలో విస్తరించింది .శతాబ్దాలుగా బౌద్ధులు,జైనులు, ముస్లింసిక్కులు మరియు గిరిజన జనాభా మధ్య గణనీయమైన కలయిక ఉంది .భారతీయ మతాల అనుచరులు ,హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు భారతదేశంలో 80-82%  జనాభా ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం భారదేశంలో 79.8% మంది హిందుమతాన్ని పాటిస్తున్నారు.ఇస్లాం14.2%, క్రిస్టియానిటీ 2.3%,సిక్కు మతం1.7 ,బౌద్ధమతం0.7, జైన మతం 0.4%.మరియు అనేక గిరిజన మతాలు ఉన్నాయి.

వివాహ బంధం:


       తరతరాల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో సంప్రదాయబద్ధంగా ఉంది .తల్లిదండ్రులు ,పిల్లలు, పిల్లల జీవిత భాగస్వాములు మరియు వారిసంతానం మొదలైనవి.కుటుంబ సభ్యులందరూ విస్తరించినప్పుడు కలిసి జీవించడం జరుగుతూ వస్తోంది .అతిపురాతన సభ్యుడు ఉమ్మడి కుటుంబవ్యవస్థలో అధిపతి.అతడే ముఖ్యమైన నిర్ణయాలను మరియు నియమాలను తీసుకుంటాడు. ఇతర కుటుంబ సభ్యులు వారిచే కట్టుబడి ఉంటారు .అలాగే భారతీయ  సమాజంలో అమర్చిన వివాహాలు దీర్ఘకాలంగా కట్టుబడి
 ఉన్నాయి. నేటి కూడా ఎక్కువ మంది భారతీయులు వారి తల్లిదండ్రులు మరియు ఇతర గౌరవనీయమైన కుటుంబ సభ్యులచే వివాహం చేసుకుంటారు .వివాహాల్లో ఎక్కువమంది వధువు కుటుంబం వరుడి కుటుంబానికి కట్నం ఇస్తారు. సంప్రదాయకంగా వరకట్నం కుటుంబ సంపద యొక్క, ఒక మహిళ యొక్క వాటాగా పరిగణించబడుతుంది. కుటుంబాల్లో కుటుంబ వారసత్వం పురుషులు మరియు స్త్రీలను వారసత్వంగా వ్యవహరిస్తుంటాయి. వారసత్వం మరియు  ఆస్తి వారసత్వం కోసం భారతీయులు చట్టచట్టబద్ధమైన వాడకాన్ని వినియోగిస్తున్నారు.

పురాతన దేవాలయాలు:

 

   అతి పురాతన దేవాలయాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి. అత్యంత శక్తి పీఠాలు కూడా మన ఇండియాలో చాలా ఏళ్ల నాటి చరిత్ర కలిగినవి. ఈ దేవాలయాలను చూస్తే మనసుకు  ప్రశాంతత కలుగుతుంది .ఈ దేవాలయాలు       ఇండియాలో ఉన్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటాయి. ఇండియాలోనే అతి     పురాతన దేవాలయాలు      ఇండియా     యొక్క ప్రసిద్ధిని చూపుతాయి ,ఇండియాలోని ప్రజలు భక్తి మార్గంలో తమ వైఖరిని చెబుతారు. ఆ       భగవంతుడ్ని ప్రార్థించడం భారత ప్రజలకు పురాతన కాలం నుంచి వస్తోంది.తమ ఆచారాలకు       సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఈ విధంగా ఇండియా     అతి పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి గాంచింది.దీనిని బట్టి ఇండియా ఒక గొప్ప దేశంగా భావిస్తారు