డాక్టరు ను భగవంతుడు అంటారు.వారిని భగవంతుడితో పోలుస్తారు. ప్రాణాలను కాపాడటానికి వచ్చిన భగవంతుడు అంటారు . మరి అలాంటి స్థాయిని కలిగినటువంటి వారు అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నారు.కొత్త ఆలోచనలకు పునాది వేస్తున్నారు.సాధారణ కాన్పు చేయాల్సిన దానికి కత్తెరలతో కోత (సిజేరియన్)
పెడుతున్నారు.అక్రమ దందా వైపు అడుగులు వేస్తున్నారు.సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నా కూడా ,సాధారణ కాన్పు చేయకుండా ఆపరేషన్లను చేస్తున్నారు .
ప్రస్తుతమైతే ప్రతి 100 లో 90 మందికి ఆపరేషన్లు చేస్తుండటం గమనార్హం.ప్రజలు ఒక డాక్టరును దేవుడిగా పూజిస్తారు. కానీ ,ఆ డాక్టర్లు మాత్రం అలా అనుకోవట్లేదు.డబ్బే ప్రధానంగా చూసుకుంటున్నారు ఒక ఆపరేషన్ కు వేలు, లక్షల్లో వసూలు చేస్తున్నారు .అవసరం లేకున్నా కూడా ఆపరేషన్స్ చేయడం వలన కొన్నిసార్లు,ఆ గాయం మూలానా అటు తల్లికి గానీ, ఇటు బిడ్డకు గాని ప్రమాదంతో చనిపోతుండడం విశేషం. ఒక వేళ తల్లికి గాని, బిడ్డకు గాని ఏదైనా ప్రమాదం సంభవిస్తే, అప్పుడు కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రజలు లక్షల్లో డబ్బు పెట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎలాగో అప్పు చేసి కట్టినా కూడా, తల్లి బిడ్డకు ప్రమాదం సంభవించి ఏదైనా జరిగితే ఇక అంతే సంగతులు.
ఇక భార్యాభర్తలు అయితే డాక్టర్లు ఏం చెబితే అదే వింటారు. తప్పదు కూడా. బిడ్డ అడ్డం తిరిగింది లేదా తల్లికి ప్రమాదంగా ఉందని, ఏదో ఒక సాకుతో ఆపరేషన్ చేయాలని నమ్మకం కలిగిస్తున్నారు . కానీ ఆ భర్త , తాను తండ్రి కాబోతున్నాడన్న ఆనందంతో డాక్టర్ ఏం చెప్పినా సరే అంటాడు .ఇక బంధువులు కూడా అంతే. డాక్టర్లు నమ్మకంగా నమ్మిస్తారు.సాధారణ కాన్పు కోసం హాస్పిటల్కు వెళితే అది ఆపరేషన్గా మారిపోతుంది. కత్తెరతో కోత పెడతారు. ఇలా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆపరేషన్లు చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు .డాక్టర్లే దేవుళ్లు అన్ని నమ్మిన ప్రజాలోకానికి కొన్ని కార్పొరేట్ హాస్పటల్లో తమ నమ్మకాన్ని పెంచుకుంటూ, దోపిడీ చేస్తుండటం గమనార్హం.
ఒకప్పుడు ఆపరేషన్లు 10 శాతంగా ఉండేది .కానీ ఇప్పుడు 30 శాతానికి పెరిగింది. దేశంలో ప్రతి 100 మందిలో 90 మందికి సిజేరియన్ జరుగుతోంది . కత్తెర కోతలతో ప్రతి గంటకు ఐదుగురు చనిపోతుండటం విశేషం. ఈ విధంగా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలు వ్యాపారం చేస్తూ లక్షల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రసవంఎంతో మంచిదని ప్రచారం చేసినా , ప్రజలు దానిపై నమ్మకం ఉంచడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్కి క్యూ కట్టడం విశేషం.