Wednesday, 25 April 2018

ఎడారి బ్రతుకులు







ఎడారిలో ఒంటెలు  మాత్రమే జీవిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఎడారికే  పరిమితం అవుతాయి.  కాలం మారినా అవి మాత్రం ఎడారిలోనే జీవనం గడుపుతాయి .ఎన్ని యుగాలైనా సరే , అవి ఎడారిలోనే ఉంటూ ప్రయాణించే వారికి ఆ ఎడారులలో ఉపయోగపడతాయి. అందుకే వాటిని " ఏడారి  ఓడలుగా" పరిగణిస్తారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే వారి దుర్భర జీవితం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు?  ఎండవేడిమికి తట్టుకుని ఎడారులలో సంచరిస్తూ ఉంటాయి.అవి ఎంతో బాధను అనుభవిస్తూ దుర్భర జీవితాన్నిగడుపు తుంటాయి.

ఆ విధంగానే జీవనాన్ని గడుపుతున్నారు భిక్షగాళ్లు .భిక్షగాళ్లు  ప్రతిరోజూ తిరగాల్సిందే. అలా తిరిగితేనే  నాలుగు పైసలు పుట్టేది.అయితే ఎంత తిరిగినా కొన్నిసార్లు ఆ నాలుగు పైసలు పుట్టవు. ఇక వారు భిక్షం అడుక్కోవడానికే పుట్టినట్టున్నారు. వారి బాధ చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది.మన కంటి నుండి నీరు కారకుండా మానదు. నిద్రాహారాలు లేకుండా ఉంటారు, ఆకలిని చంపుకొని ఉంటారు .


          ప్రతి సంవత్సరం చూస్తే  వేల కొద్ది వీరు పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం వీరి జనాభా అత్యధికంగా పెరుగుతుందని చెప్పవచ్చు.
ఇక ప్రతిరోజు వారికి అదే కార్యక్రమం ఉంటుంది .ఉదయాన్నే గుడి వద్దకు, మధ్యాహ్నం వేళ రోడ్ల మీదికి, సాయంత్రం మళ్లీ   గుడి వద్దకు వెళ్తారు.రోజంతా కష్టపడితే వారికి నాలుగైదు పైసలు వస్తాయి. ఒక్కోసారి వారికి చిల్లిగవ్వకూడా రావు. చెప్పాలంటే ,వారు ఎంత కష్టపడితే ఎంత సంపాదిస్తారు? వారు వేలు ,లక్షలు ఎప్పుడైనా చూసి ఉంటారా, కనీసం కడుపు నిండా సంతోషంగా భోజనం తిని ఉంటారా,కనీసం కంటినిండా నిద్రపోయి ఉంటారా.



ప్రతి ఒక్కరూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే వాహనాలను ఉపయోగిస్తారు .మరి వారికి నడక దారే గతి .అన్ని ప్రాంతాలు ,అన్ని ఏరియాలు,అన్ని ప్రదేశాలు వారివే.ఏ   ఒక్క ప్రదేశంను  వదిలిపెట్టి ఉండరు .నడక దారిలోనే వారి  ప్రయాణం అంతా సాగుతుంది .ఏవైనా పండుగల సమయాల్లో ప్రతి గుడి దగ్గర వేల మంది బిచ్చగాళ్లు ఉంటారు. కనీసం అప్పుడైనా దేవుడు కరుణిస్తాడని, నాలుగైదు పైసలు పుడతాయని  వారి ఆశ.

ఇక మిగతా సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను చూసుకుంటారు .ఎండా, వాన  ,రేయి పగలు అనే తేడా లేకుండా ప్రతిరోజు ఈ విధంగా  బిచ్చ మెత్తుకుంటూ ఉంటారు .కానీ వారికి తెలియదు ఈ సమాజంలో దోచుకునే మూర్ఖులు ఎక్కువ అవుతున్నారని. కనీసం వారిని చూచి చులకనగా చూస్తారు కానీ ,నాలుగైదు పైసలు మాత్రం ఇవ్వరు.వారి స్థానంలో ఉండి చూస్తే తెలుస్తుంది వారు పడే తపన ఏమిటో.



 ఇక వారి పిల్లల జీవితం చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. ఆ పసి పిల్లలకు తెలుస్తుందా ,భిక్షం ఎత్తుకునే విధంగా పుడతామని, బుల్లిబుల్లి  అడుగులతో ఎంతో హాయిగా ఉండాల్సిన వారు, ఇలా అడుక్కోవడం బాధ కలిగించే విషయం. వారి బాల్యం అంతా ఒకసారి చూసుకుంటే ఏమీ ఉండదు. పుట్టినప్పటి నుంచి మరణించినప్పటి వరకు అవే సమస్యలు, అదే దుర్భర జీవితం.
గుడి వద్ద అడుక్కుంటున్నారు, రోడ్ల మీద అడుక్కుంటున్నారు , రద్దీ ప్రాంతాల్లో కూడా అడుక్కుంటున్నారు .ఏ ఏరియా చూసినా ,ఏ ప్రదేశం చూసిన వీరే కనపడతారు.


       ఇక వీరిలో ఏ ఆశయాలు ఉండవు, ఏ కోరికలు కనిపించవు. ఉన్నది ఒకటే కోరక  బిక్షాటన చేయడం, మూడు పూటలా కడుపునిండా తినడం. వీరిలో మనలా హడావిడి ,తాపత్రయాలు కనిపించవు , ,అబద్ధాలు కనిపించవు, మోసాలు కనిపించవు, హోదాలు, పేరు ప్రఖ్యాతలు ఇవేమీ ఉండవు .వీరి జీవితం అంతా ఒక్కటే ,వచ్చిన నాలుగైదు పైసలతో కడుపు నింపుకోవడం.కడుపు నింపుకుంటూ జీవితాన్ని సాగిస్తారు. కాలం మారినా వీరిని మార్చేవారు కనపడటం లేదు.ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా వీరు మాత్రం ఇలాగే ఉండాల్సి వస్తుందేమో.

Monday, 23 April 2018

అమ్మా - నాన్న ఓ జీవితం






అమ్మ మనకు ప్రాణం పోస్తుంది. నాన్న మనకు జీవితాన్నిస్తాడు .అమ్మానాన్నలు లేని, ఏ ప్రపంచం లేదు.ఈ ప్రపంచమంతా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది.మన యొక్క సృష్టి ఆవిర్భావానికి మూలం ఆ అమ్మానాన్నలే .అమ్మ మన యొక్క బాధ్యతను స్వీకరిస్తే, నాన్న మన భారాన్ని భరిస్తాడు . మనల్ని  ఎంతోఉన్నత శిఖరాలకు చేర్చాలనే వారి తాపత్రయమే మనల్ని అత్యున్నత శిఖరాలు చేరవేస్తుంది. ఎంతో ఉన్నత శిఖరాల్లో చేరుతాం కూడా. చిన్నప్పట్నుంచే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు .మనకి ఏం కావాలన్నా కూడా తెచ్చిచ్చే బాధ్యత తల్లిదండ్రులే చూసుకుంటారు.  ఎంతో గారాబంగా చూసుకుంటారు.


ఈ చరాచర సృష్టికి మూల కారణమైన తల్లిదండ్రులు ఎంతో గొప్పవాడు. తల్లిదండ్రులు లేని జీవకోటికి మనుగడ లేదు. మనం దేవుని ఎంతగానోప్రార్థిస్తాం, చాలా కోరికలు కోరుకుంటాం. మరి మనకు కావలసిన కోరికలను నెరవేర్చే  తల్లిదండ్రులను మాత్రం ప్రార్థించడం ఎందుకు ?  , అలాగే మన సృష్టికి మూలకారణమైన తల్లిదండ్రులను ఆరాధించం.  మనకు అన్నీ ఇచ్చే మన తల్లిదండ్రులను గాక, ఏమీ ఇవ్వని భగవంతుడిని ప్రార్థిస్తారు .కానీ ఒకసారి ఆలోచిస్తే మనకు అన్నీ ఇచ్చే ఆ తల్లిదండ్రులను ఇచ్చింది ఆ భగవంతుడే కదా.అది మాత్రం ఎవరూ తెలుసుకోవడం లేదు.



ఆ భగవంతుడు మనం  ఏ వరం కోరుకోకుండానే తల్లిదండ్రులను  ఇచ్చాడు.మన సృష్టి కారణం వారే కదా. మన యొక్క  అవసరమైన ప్రతి కోరికలను తీరుస్తారు .కానీ తల్లిదండ్రులను మాత్రం పూజించక పోగా,కనీసం గౌరవించరు.బాగా ఆలోచిస్తే, భగవంతుడు మన తల్లిదండ్రులను రూపంలోనే ఉంటాడని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది

సాక్షాత్తు ఆ భగవంతుడే అంటాడు" నేను మీకు తల్లిదండ్రులను ఇచ్చాను. మీ సృష్టికి గల కారణం వారే కదా.   మీరు కోరిన కోరికలు తీర్చే తల్లిదండ్రులను నేను ఇచ్చాను.కానీ మీరువారిని మరిచిపోతున్నారు .మీకు ఉన్నటువంటి అజ్ఞానంతో దానిని గమనించడం లేదు.ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమించాలి. భగవంతుడిగా నేను సైతం కోరుకునేది అదే కదా.పరమాత్మ ఎక్కడో లేడు తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నాడు .దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి" . ఈ విధంగా ఆ భగవంతుడే అంటాడు.



ప్రస్తుత కాలంలో అయితే తల్లిదండ్రులను ఆరాధించేవారు  కనుమరుగై పోతున్నారు .మనమెంతో ఆప్యాయంగా అల్లారు ముద్దుగా పెంచిన వారికి, బహుమతిగా ఇంటి నుంచి వెలివేస్తున్నారు .మనం ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా తెచ్చిచ్చేవారు,చివరికి  వారి జీవితం ఎడారిలా మారిపోతోంది .వారు జీవించి ఉన్నంత వరకు పిల్లల శ్రేయస్సునే కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి కావలసిన,కోరుకున్న జీవితాన్ని కూడా అందిస్తారు.ఏం కోరుకున్నా ఇవ్వని భగవంతుడ్ని చాలా  కోరుకుంటాం , కానీ మరి అన్నీ  ఇచ్చే మన తల్లిదండ్రులను మాత్రం గుర్తించం. మరి ఏమీ ఇవ్వని ఆ భగవంతుడిని దేవుడిగా నమ్మినప్పుడు మనకు అన్ని ఇచ్చే తల్లిదండ్రులు కూడా దేవుళ్లతో సమానమే కదా! వారూ ఆ పరమాత్మతో సమానమే కదా ! వారు ఎంతో కష్టపడి మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనే వారి  ఆశ మహోన్నతమైనది .చాలా గొప్ప మనసు కలవారు, అందుకే ఆ భగవంతుడే మనకు తల్లిదండ్రులను ఇచ్చాడు  , ప్రతి ఒక్కరూ దీనిని ఆలోచించాలి.


ప్రస్తుత కాలంలో అయితే తల్లిదండ్రులను ఆదరించేవారు కరువైపోతున్నారు. ఎంతో ప్రేమతో మనల్ని పెంచి పోషించిన వారికి ఆదరాభిమానాలు కరువైపోతున్నాయి .ప్రస్తుతం చూస్తే రోజురోజుకు తల్లిదండ్రులను వదిలించుకున్న వారు ఎక్కువైపోతున్నారు. నానాటికీ  old Age Homes వృద్ధాశ్రమాలు  నిండిపోతున్నాయి .మన కలల్ని సాకారం చేసిన వారికి బహుమతిగా వృద్ధాశ్రమాలలో వదిలిపెడుతున్నారు .ఇది ఎంత వరకు న్యాయం .

ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన కూడా ఓల్డ్ ఏజ్ హోం Old Age Homes  లలో  వృద్ధుల సంఖ్య పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.   అదేవిధంగా తల్లిదండ్రులు వృద్ధులు అయ్యాక ,వారిని భారంగా చూస్తున్నారు. వీటిసంఖ్య చాలా ఎక్కువగా ఉండటం విశేషం. మరికొంత మందైతే  హోల్డ్ ఏజ్ హోమ్స్ old Age Homes లలో వదలక పోగా,  ఎక్కడో ఒక చోట వదిలిపెడుతున్నారు. మరికొంత మంది అయితే  స్మశాన వాటికల్లో అనాథలా వదిలిపెడుతున్నారు. ఇది చాలా బాధాకరం.



   ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పులు రావాల్సి ఉంది. చిన్నతనంలో తమ తల్లిదండ్రులు ఏ విధంగానైతే ప్రేమించారో,  ఆ విధంగా తమ తల్లిదండ్రులనూ ప్రేమించే విధంగా ఉండాలి. తల్లిదండ్రులను చూడటం ఒక భారంగా అనుకోకూడదు .తల్లిదండ్రులను ప్రేమిస్తే, ఆ భగవంతుడిని ప్రార్థించినట్టే .

Saturday, 7 April 2018

కలల ప్రపంచానికి దూరాన






      ఎన్నో కలలు ఎన్నో ఆశయాలు ప్రతి విద్యార్థిని ముందుకు నడిపిస్తాయి. ఎన్నో ఊహలతో, తమ జీవితం   అందంగా  ఉండాలని   కోరుకుంటారు. అందుకుగానూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. తమ జీవితాన్ని అందంగా మార్చుకోవడం కోసం అందుకు తగిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పుస్తకాల పురుగులుగా    మారతారు.   నిరంతరం   ఎంతో కష్టపడుతూ      ఉంటారు.     తాము      పెట్టుకున్న ఆశయాలతో    ఊహల్లో    తేలిపోతూ   ఉంటారు. కచ్చితంగా     ఏదైనా     సాధిస్తామనే   నమ్మకంతో ప్రయాణిస్తూ ఉంటారు.  ఒక నమ్మకంతో ( faith) సముద్రంలోని నావ లా ప్రయాణిస్తూ ఉంటారు.


   కానీ,   ఇక్కడ జరిగేది వేరు. ఎన్నో ఆశయాలతో ఉన్న యువతకు చుక్కెదురవుతోంది.  వారు కన్న కలలు  ఆవిరైపోతున్నాయి . ఊహించుకున్న  ఆశలు (ambitions)    నీరుగారిపోతున్నాయి.    వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగాలు రావడం లేదు. ఎన్నుకున్న ప్రభుత్వాలు యువత ఆశయాలకు కనీసం పునాదులు కూడా వేయడం లేదు.  ఎంతో  మంది   కన్న కలలకు    ఆటంకం ఏర్పడుతుంది. వారి     ఆశయాలు నిర్జీవంగా మిగిలిపోతున్నాయి.అటు చూస్తే , ప్రభుత్వాల నుండి సమాచారం రాక , ఇటు చూస్తే ఉద్యోగాన్వేషనలో ఎన్నిక (select) కాక   యువత    నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.వారి     ఆశయాలు      అన్నీ   ఆవిరైపోతున్నాయి. ఎంతో ప్రతిభ ఉన్న యువతకు వారి సామర్థ్యాన్ని    వెలికితీయడానికి      అవకాశం రావట్లేదు అని చెప్పవచ్చు.

     ఈ సందర్భంగా చాలామంది యువత ఎక్కువ     ఒత్తిడికి    గురై     ఆత్మహత్యలకు     పాల్పడటం జరుగుతోంది. తమ    కుటుంబాన్ని     అందంగా తీర్చిదిద్దుకోవాలన్న వారి కోరిక నీరుగారిపోతోంది. తమ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రుల   నమ్మకాన్ని ( faiths) నిలబెట్టుకోలేకపోతున్నామనే వారి దీనావస్థ ఎవరికీ అర్ధం కాదు.ఈ లోకం వారికి ఏమీ    ఇవ్వలేదనే    భ్రమ    వారిని ఆత్మహత్యలు     చేసుకునే       విధంగా ప్రేరేపిస్తోంది.   వారు సొంతంగా ఏర్పరచుకున్న రెక్కలకు ఎదురుగాలి వీస్తోంది. తమను కన్నవారిని శోకసంద్రంలో ముంచి వెళ్తున్నారు.


                 మరి,వారి రంగుల ప్రపంచానికి   అడ్డం తగులుతున్నది  ఎవరు?   ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడానికి కారణమేమిటి?  ఏం చేస్తే వారి ఆశయం నెరవేరుతుంది.ప్రభుత్వాలు (govt) మారినా తలరాత మారదా !     అన్నట్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ,     యువతకు ఉపాధి చూపించడం లేదు. కనీసం    ఒక మార్గం చూపించకపోవడం గమనార్హం. యువత కన్నకలలు ఊహాజనితంగానే    మిగిలిపోతున్నాయి. ప్రతి సంవత్సరం చూస్తే,    నిరుద్యోగం సమస్య (unemployment) అంతకంతకూ ( high level)  పెరిగిపోతుండడం  విశేషం.ప్రతిసంవత్సరం నిరుద్యోగ సమస్య ఎలా ఉందో     ఒకసారి గమనించవచ్చు.         

              Year            percentage 

         
               2007                  3.7
               2008                  4.1
               2009                  3.9
               2010                  3.6
               2011                  3.7
               2012                  3.7
               2013                  3.6
               2014                  3.5
               2015                  3.5
               2016                  3.5
               2017                  3.4
               2018                  3.5
Block-' + placement_id + '">

Tuesday, 3 April 2018

సొమ్ము ఒకరిది - సోకు ఒకరిది





మానవులు కష్టపడే తత్వం   గలవారు.  ఆ కష్టానికి తగినట్లుగా   ఫలితము   ఉంటుంది.   అది ఎందులో కష్టపడినా   సరే    ఫలితం    దక్కాల్సిందే.   ప్రస్తుతం మానవులను     డబ్బు  నడిపిస్తోంది .   డబ్బు లేని ప్రపంచమే లేదు అన్నట్లుగా ఉంటుంది.   ప్రతి మనిషి డబ్బుపై ఆధారపడాల్సిందే . డబ్బుకోసం ఎంతకైనా కష్టపడాల్సిందే.  కష్టపడతారు కూడా. డబ్బు అనేది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది.   ఆ డబ్బు కోసం ఎటువంటి పనులు    చేయడానికైనా  సిద్ధంగా ఉంటారు.


   ఒకరు ఎంతో కష్టపడి సంపాదిస్తారు. ఆ డబ్బుని అలాగే పొదుపు చేసుకుంటూ ఉంటారు   (saving money),  కొంతమంది     బంగారం   (gold form) రూపంలో      భద్రపరుచుకుంటారు.    అదంతా  కష్టపడినందుకు    ఫలితం . ఎంత కష్టపడితే  అంత డబ్బు    వస్తుందనే    ఆశ     ప్రతి     ఒక్కరిలోనూ ఉంటుంది.  డబ్బు   వస్తున్న    కొద్దీ మనిషిలో కలిగే  ఆశ  ఎప్పటికీ   తరిగిపోదు.   డబ్బుపై ఉన్న ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డబ్బు  వస్తున్న కొద్దీ ఇంకా కావాలని అనుకుంటాడు. పగలు,రాత్రి   అనే తేడా   లేకుండా    పనిచేస్తూ  ఎంతో సంపాదిస్తారు. అయితే వారు    సంపాదించిన    దానికి    ఫలితం ఉంటుంది. దానిని భద్రంగా  దాచుకుంటారు.   మరి  ఎంతకాలం   (howmany days )    సంపాదించిన సంపాదనను (earn money)  భద్రపరుచుకుంటారు ?  సంపాదించిన  డబ్బు అలాగే   జాగ్రత్తగా ఉంటుందా ?.



   మనం సంపాదించిన  డబ్బు   ఇంట్లో   అలాగే జాగ్రత్తగా ఉంటుంది      అనుకుంటే     పొరపాటే. మారుతున్న    పరిస్థితుల దృష్ట్యా ,  మారుతున్న కాలానుగుణంగా వాటిని దోచుకునేవారు (theft) మారుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు . ప్రస్తుతం ప్రతి   ఒక్కరు   టెక్నాలజికి (technology)  అలవాటు పడుతుంటే. వారు కూడా టెక్నాలజీల్లో    ముందుకు   దూసుకుపోతున్నారు .దొంగతనాలు చేయటంలో విభిన్నమైన టెక్నాలజీని ఫాలో (follow)  అవుతున్నారు. ఒక్కరి వల్ల సాధ్యం కాకపోతే గ్రూపుగా పనిచేస్తున్నారు.  ఎవరైనా అడ్డం వస్తే   ఏదైనా  చేయడానికైనా  వెనకాడకపోవడం గమనార్హం.  చంపడానికి    వెనుకాడడం   లేదు . అటువంటి వారు ప్రాణాలు తీయడం  కోసం లెక్క చేయడం     లేదు.   ప్రతి    సంవత్సరం    చూస్తే దొంగతనాలు     చేసేవారు    పెరుగుతుండటం విశేషం.  మరో విషయం  ఏమిటంటే  దొంగతనాలు ఎక్కువగా    యువతే     చేస్తుండటం    అందర్నీ  ఆశ్చర్యాన్ని    కలిగించే   విషయం.



డబ్బు మనిషిని నడిపిస్తుందని దాన్ని దానికి ఇది ఒక పెద్ద    ఉదాహరణగా   చెప్పవచ్చు  .  ఒకరు కష్టపడిన సొమ్మును ఇంకొకరు   దోచుకుంటున్నారు. దోచుకోవడంలో (theft)  కూడా కష్టపడిన  దానికి ఫలితం ఉంటుంది.  ఎవరైనా ఒకసారి ఇల్లు వదిలి వెళ్లాలంటే     ఇక  అంతే    సంగతులు.     వచ్చిన      తర్వాత   చూస్తే   సంపాదించిన  డబ్బు,  బంగారం కనిపించవు.    ఇలా ఒకరు   సంపాదించిన దానికి ఫలితం ఇంకో వారు అనుభవిస్తారు .అందుకే మన   పెద్దలు     సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అని అన్నారు.

Sunday, 1 April 2018

మానవత్వం అంతరించిన వేళ

 


     మానవత్వం అనేది ప్రతి   ఒక్కరికీ  ఉంటుంది. మానవత్వం ఉంటే కనుక   ఎవరి   జీవితమైనా ఆనందంగా ఉండడానికి   కారణం అవుతుంది. అసలు మానవత్వానికి ముగింపు లేదనే చెప్పవచ్చు . ఎప్పటికీ    ఉండదు   కూడా.    ఒక మనిషిలో మానవత్వం అనేది  ఎప్పుడు పడుతుందంటే, ఎవరైనా ఆపదలో ఉన్నపుడు, ఎవరికైనా సహాయ సహకారాలు అవసరమైనపుడు     మానవత్వం పుడుతుంది. మానవత్వం అనే పదాన్ని దేవుడిచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. సగటు మనిషికి కష్టం వస్తే ఆదుకునే అవకాశం ఎంతో పుణ్యానికి నాందిగా పేర్కొనవచ్చు .



అయితే ప్రస్తుతం చూస్తే మానవత్వం అనే పదం అంతరించిపోయిందని     చెప్పాలి.    ప్రస్తుత సమాజంలో మానవత్వాన్ని  ఇంచుకైనా ఎక్కడా కనపడదు. ఎంతో టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో    ఆ టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆ టెక్నాలజీకి అలవాటు    పడుతున్నారే    తప్ప ,ఇతరులకు సాయం చేయాలనే మాట గతి తప్పింది. సహాయం కోరవచ్చని వారిని చులకనగా చూడడమే తప్ప  వారి యొక్క దీనావస్థను   ఎవరూ   అర్థం చేసుకోరు.ఇక ఆపదల్లో ఉన్న వారికి సైతం సాయం చేయకపోవడం గమనార్హం.

     ప్రస్తుతం అయితే ఎవరైనా ఆపదలలో  ఉండి సహాయం కోరినా పట్టించుకోవజం లేదు.   వారి యొక్క ఆర్తనాదాలను  ఎవరూ   వినిపించుకోరు.     ఆ సమయంలో ప్రక్కనే  ఎంతో మంది    ఉన్నా కనికరించే వారే లేరే  అనే వారి బాధ వర్ణనాతీతం. మొబైల్ ఫోన్స్ తో వీడియోలు చేసుకుంటారే గాని, కొంచెం సాహాయం చేయాలనే     ఆలోచన కూడా ఎవరికీ రాదు. రేపు మన పరిస్థితి ఇలాగే వస్తే ఏంటి ! అని ఎవరూ ఆలోచించడం లేదు.



  అదే విధంగా రోడ్లపై ఎంతోమంది బిచ్చగాళ్ళు ఉంటున్నారు. మరియు ప్రతి దేవుళ్ల గుడి వద్ద కూడా ఎంతోమంది ఉంటారు. కనీసం వారిని    ఆదుకునే వారే కరువయ్యారు.   ప్రస్తుతం ప్రతి   సంవత్సరం చూసుకుంటే వారి    జనాభా    పెరుగుతుండటం విశేషం. ఎన్నుకున్న    ప్రభుత్వాలు   మారుతున్నా బిచ్చగాళ్ల జీవితాలు మారడం లేదు.కనీసం వారి  పిల్లలను సైతం బిక్షాటన చేయిస్తుండటం బాధాకరం .పసి హృదయాలు రోడ్లపై భిక్షాటన చేస్తున్నారు.


 
  అసలు మానవత్వం అనేది ఎక్కడా కనిపించడం లేదు.     ప్రతి మనిషి    తన   జీవితం    మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నాడు గానీ ,ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన కూడా రాదు, ప్రస్తుతం ప్రతి మనిషిలోఎవరు ఎటు పోతే   నాకేంటి! అనే స్వార్థం   పెరిగిపోతోంది.     చూసి      చూడనట్లు వ్యవహరిస్తున్నారు     గానీ,     తమ  స్వార్థాన్ని మాత్రంవిడిచి పెట్టడం లేదు.

   భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎంతో    జ్ఞానాన్ని ఇచ్చాడు.దానిని   మంచి   మార్గంలో   గాక, చెడు మార్గంలో         ఉపయోగించుకుంటున్నారు. భగవంతుడిచ్చిన     జ్ఞానాన్ని స్వార్థంతో  నింపేసుకోవడం   అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.