Friday, 29 June 2018

అంగడిలో బొమ్మ - చదువుల సరస్వతి







విద్య అనేది జ్ఞానాన్ని ఇస్తుంది, బుద్ధిని ప్రసాదిస్తుంది, వినయం విధేయతలను నేర్పిస్తుంది. విద్య అనేది ప్రతి ఒక్కరికీ కావాలి మరియు ఎంతో అవసరం కూడా. విద్య ఉన్నత శిఖరాలను చేరడంలో సహాయపడుతుంది. త్వరితగతిన గమ్య స్థానానికి అనగా, చదువుల పరంగా ఏ విధమైన కలలు కంటామో, ఆ కలలు  నెరవేరడానికి కృషి చేస్తుంది ,అలాగే అత్యున్నత శిఖరాలను  చేర్చటమే గాక ,పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. మరి అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, అత్యున్నత శిఖరాలను చేరాలంటే, విద్య ఎంతో అవసరం.



విద్య  ప్రతి ఒక్కరి ఆశయం.కానీ కొంతమందికి అనివార్య కారణాల వలన కుదరకపోవచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని ఆశయంతో ఉంటారు. పెద్ద చదువులు చదివించాలని అనుకుంటారు .ఎంత కష్టపడైనా, తమ పిల్లల ఫీజులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటారు. ఫీజులు లక్షల్లో ఉన్న కూడా, తమ పిల్లల చదువులు బాగుండాలనే కోరికతో ఎంతటి ఫీజులైనా  వెనకాడడం లేదు.


అయితే ప్రస్తుతం మనం గమనిస్తే, ప్రతి ఒక్కరికీ చదువు నెపంతో ఫీజులు  భారం అయిపోతున్నాయి . ఇప్పుడు పిల్లలను చదివించాలంటే ఫీజులు వేలల్లో కాదు ,లక్షల్లో కావాలి .కానీ తల్లిదండ్రులుఎంత మాత్రం అందుకు ఆలోచించడం లేదు. తమ పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నారు.  ఎంతటి ఫీజులైనా సరే కట్టాల్సిన పరిస్థితి.

కానీ ,దీన్ని అలుసుగా చేసుకుని కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి నుంచి లక్షలను సొమ్ముచేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ఫీజులను పెంచుతూ ,అడ్డగోలుగా సంపాదించుకుంటున్నాయి .విద్యతో వ్యాపారాన్ని చేసుకుంటున్నాయి .చదువుల సరస్వతిని ఒక వ్యాపార వాణిజ్యంగా మార్చుకుంటున్నారు .


డబ్బు కోసం విద్యను, వ్యాపార కేంద్రంగా మార్చి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.కానీ పిల్లల తల్లిదండ్రులు ఇందుకు ఏమాత్రం ఆలోచించడం లేదు . కార్పొరేట్ వాళ్లు విద్యతో వ్యాపారం చేస్తున్నా కూడా, తమ పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం చదివించాల్సిన తప్పని పరిస్థితి.ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్లు ,కాలేజీలు మార్కుల నెపంతో, వారి స్కూళ్లకు గానీ, కాలేజీలకు గానీ ఒక బ్రాండ్  ఇమేజ్ ని   తీసుకువచ్చి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంచుకుంటున్నాయి.  దానిని చూసి తల్లిదండ్రులు ఆ కాలేజీలు, స్కూళ్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఆ విధంగా విద్యను ఒక పెద్ద  వాణిజ్య కేంద్రంగా చేసుకుని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.


ప్రతి సంవత్సరం ఫీజులను పెంచి, అటు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తు, అలాగే చదువుల నెపంతో పిల్లలపై కూడా ఒత్తిడి తెస్తున్నాయి .దీనికి ఫలితాలే పిల్లల ఆత్మహత్యలు . ప్రతి ఏటా చదువుల నేపంతో ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలు, అంతకంతకు పెరిగిపోతున్నారు .అదే విధంగా తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చాలామంది తల్లిదండ్రులు నానా కష్టాలు పడి అప్పులు చేస్తున్నవారూ ఉన్నారు . ప్రస్తుతం విద్య అనేది వ్యాపారం అయిపోయింది. చదువుల సరస్వతి అంగడిలో బొమ్మలాగా మారిపోయింది .ఒకప్పటి చదువు, ఇప్పటి చదువు ఎలా ఉండేదో ఒకసారి మనం గమనిస్తే తెలుస్తుంది.

Tuesday, 19 June 2018

అవినీతి కథా చిత్రం






మానవ జీవితం డబ్బు మీద ఆధారపడి ఉంటుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు .ప్రస్తుత సమాజంలో మానవుడు డబ్బు మీద  చూపిస్తున్న ప్రేమ సమాజంపై చూపడం లేదు. డబ్బు మీద ఆశతో అసలు జీవితాన్ని ఆనందం గా గడపలేక పోతున్నారు.ఈ సమాజంలో ఏదీ కూడా శాశ్వతం కాదని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆఖరికి మానవ శరీరం కూడా శాశ్వతం గా ఉండదు. అక్రమార్జనతో ఎంతో సంపాదించిన వారు, తమ జీవితం శాశ్వతం కాదని అర్థం  చేసుకోలేకపోతున్నాడు .ఏ రంగంలో చూసినా అవినీతి అంతర్భాగంగా ఉండి,అవినీతిపరులు ఎక్కువైపోతున్నారు. ఈ అవినీతి పట్ల మన సామాన్య ప్రజానీకం బాధపడుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీన్నినిర్మూలించడానికి ఎవరూ ముందుకు రారు, కనీసం దీని బారిన పడిన వారిని ఆదుకునే వారు సైతం కరువయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్న అవినీతి అంతకంతకు రెట్టింపు అవుతోంది. అక్రమార్జనే ధ్యేయంగా చాలామంది అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారు .ఏ పని చేయాలన్నా అవినీతి ఉండాల్సిందే.

  ఈ రోజుల్లో అయితే అక్రమార్జనతో సంపాదించేవారు అంతకంతకు పెరగడంతో అతిశయోక్తి లేదు .అదే  విధంగా ఎంత సంపాదించినా సగటు మనిషికి ఆశ చాలడం లేదు.సంపాదించిన దానితో సంతోషంగా అనుభవిస్తాడు అనుకుంటే ,అదీ లేదు .ఎందుకు ఈ తాపత్రయం." మానవజన్మ జీవితాన్ని" ప్రకృతికి  అనుగుణంగా జీవించలేమా ? ప్రకృతి మనకు అన్నింటినీ  అని అందిస్తోంది .మరి, ఇక మనకు ఏం కావాలి?  మరణించిన తర్వాత ఏ ఆస్తులు మనతో రావు కదా? ఇదంతా ఎవరి కోసమైతే చేశావో, ఆ కుటుంబం కూడా మనతోపాటే రాదు. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది" జీరో "అని ప్రతి మానవుడు గుర్తించలేకపోతున్నాడు. మన సహాయం కోర వచ్చిన వారికి సహాయం చేయకపోగా, అక్రమ ధనాన్ని సంపాదించడానికి పూనుకుంటున్నారు. భగవంతుడిచ్చిన దానితోతృప్తి పడలేక పోవడం విశేషం.



అవినీతితో ఎంత సంపాదించినా ఆ సొమ్మును అనుభవించడానికి చివరి వరకు జీవించి ఉంటారా  అనేది ఎవరు గుర్తుంచుకోవడం లేదు. అజ్ఞానంలో మునిగి తేలుతున్నారు. ఆ భగవంతుడిచ్చిన ఉన్నతమైన జీవితాన్ని దేనికి  ఉపయోగించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. అవినీతి అన్న పదం కేవలం నాలుగు అక్షరాల్లో కూడి ఉంది .కానీ, అవినీతి ఏ రూపంలో ఉంటుందో మనందరికీ తెలుసు .అవినీతి అనేది ప్రస్తుతం ఎక్కడ  చూసినా కనబడుతుంది . అంటే సర్వసాధారణమైపోయింది .ప్రతి పనిలో అవినీతి కనపడుతోంది. పురాతన కాలంలో అవినీతి అనేది కనపడకుండా ఉండేది .కానీ, ప్రస్తుతం అయితే ప్రతి ఒక్క విషయంలో అవినీతి లేదంటే అతిశయోక్తి కాదు.

ఒకసారి మనం గమనిస్తే అవినీతి అనేది మొత్తం 175 కంట్రీస్   లలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా 2014 లో చూస్తే 85స్థానం, 2015లో చూస్తే 76వ స్థానం, 2016 లో చూస్తే 79వ స్థానం, 2017 లో  చూస్తే 81 వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది .దీనిని బట్టి అవినీతికి ఎంతగా అలవాటు పడుతున్నారో తెలుస్తోంది.

Monday, 21 May 2018

జీవితం - విలువ







జీవితం అంటే మరేమిటో కాదు బ్రతికినన్ని నాళ్ళు సమాజంలో ఎలా బ్రతుకుతున్నామన్నదే జీవితం
 . జీవితంలో మంచి, చెడు చాలా ముఖ్యమైనవి. జీవితం అందంగా ఉండాలంటే "మంచి"ని మన జీవితంలోకి ఆహ్వానించాలి . ఇక చెడు గురించి అందరికీ తెలిసిందే .ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎంత మంది "మంచి" అనే పదంను ఆహ్వానిస్తున్నారు .అసలు మంచి చేయడం పక్కన పెడితే ,చెడును ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి ఓసారి విశ్లేషణ చేసుకుంటే తమ జీవితం గురించి ఎలా తీర్చిదిద్దుకుంటున్నారో తెలుస్తుంది. తమ జీవితాన్ని సరైన దారిలో తీసుకువెళ్తున్నారో, లేదో తెలుస్తుంది.ప్రతి ఒక్కరు ,దీని గురించి ముందే ఆలోచిస్తే ,ఆ తర్వాత మంచి మార్గంలోనే మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది.


పుట్టడం మన చేతిలో ఉండదు, మరణం కూడా మన చేతులో ఉండదు. ఎక్కడ్నుంచి వస్తామో తెలీదు, చివరకి ఎక్కడికి  వెళతామో  తెలియదు, ఆ భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించాడో కూడా తెలీదు, అసలు ఎందుకు పుట్టామో తెలీదు,  ఏ ఆశయం కోసం పుట్టామో తెలీదు, పుట్టాక పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నామో తెలీదు, మొత్తం ఒకసారి జీవితం చూస్తే ఏం కనపడదు .ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. .అందమైన జీవితం గురించి ఎవరూ ఊహించుకోవడం లేదు . జీవితం గురించిన అవగాహన ఎవరికీ ఉండటం లేదు.


 భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడో ఒకసారి ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది." జీవితం  విలువ తెలిసిన వాడే జ్ఞాని" అని మన పెద్దలు, పూర్వికులు చెప్పారు .కానీ ఎంతమందికి జీవితం గురించిన విలువ తెలుసు ? జీవితం అంటే ఏదో ఒకటి చేసి  మరణించినా, ఆ ఏదో ఒకటి చేయడంలో ఎక్కువ చెడే దాగి  ఉంటోంది. చాలామంది చెడుకి అలవాటుపడుతున్నారు. లోకంలో 20%  మంచిని చేసే వారుంటే, 80% చెడును చేసేవారు కనబడుతున్నారు.

ప్రస్తుతం చెడుకు అలవాటు  పడిన వారే ఎక్కువగా కనపడతారు. మంచి, చెడు ఆలోచించే గుణం లేకపోవడం బాధ కలిగించే విషయం. చెడు చేయడం ద్వారా తొందరగా సంతోషం కలిగినా,ఆ తరువాత బాధ వస్తుంది.అదే విధంగా మంచి చేయడం ద్వారా ముందు కష్టం కలిగినా ,ఆ తర్వాత సంతోషం వస్తుంది .కానీ దీనిని ఎవరూ గమనించడం లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందు చెడుకి అలవాటుపడుతున్నారు .చెడు చేయడం వలన వచ్చే ఫలితాలను ఎవరూ గమనించడం లేదు.


ఆ భగవంతుడిని దర్శిస్తూ తమకు కావలసిన కోరికలను ఎన్నెన్నో కోరుకుంటారు. చాలా కోరికలను కోరుకుంటారు. మరి ప్రతి ఒక్కరూ కోరిన కోరికలను ఆ భగవంతుడు తీరుస్తాడా ? మన యొక్క జీవితంలో ఏం చేశావని మన  కోరికలు తీరుస్తాడు?అనీ ఒక ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది .మంచి చేసేవారు ఎవరైనా సరే, మంచి చేస్తే కనుక భగవంతుడు తప్పనిసరిగా,ఎవరికైనా కోరిన కోరికలను తప్పని సరిగా తీరుస్తాడు .ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.

భగవంతుడు ఎవరికీ కనపడడు కానీ మంచి చేసే వారి రూపంలో దాగి ఉంటాడు.  ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి. జీవితం అనేది ఎంతో విలువైనది. అది ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. మంచి చేస్తే ప్రతి ఒక్కరి జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. ఆ జీవితానికి ఎంతో విలువ వస్తుంది. ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దుకోవాలి.


ప్రతి ఒక్కరికీ జీవితాన్ని చిన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఇస్తారు. వారికి పెళ్లిళ్లు అయ్యాక, ఇక వారి జీవితాలను వారే తీర్చిదిద్దుకోవాలి .జీవితం ఎంతో ఎంత విలువైనదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి .తమ జీవితాన్ని ప్రతి ఒక్కరూ అందంగా తీర్చిదిద్దుకునే విధంగా ఉండాలి.

Wednesday, 25 April 2018

ఎడారి బ్రతుకులు







ఎడారిలో ఒంటెలు  మాత్రమే జీవిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఎడారికే  పరిమితం అవుతాయి.  కాలం మారినా అవి మాత్రం ఎడారిలోనే జీవనం గడుపుతాయి .ఎన్ని యుగాలైనా సరే , అవి ఎడారిలోనే ఉంటూ ప్రయాణించే వారికి ఆ ఎడారులలో ఉపయోగపడతాయి. అందుకే వాటిని " ఏడారి  ఓడలుగా" పరిగణిస్తారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే వారి దుర్భర జీవితం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు?  ఎండవేడిమికి తట్టుకుని ఎడారులలో సంచరిస్తూ ఉంటాయి.అవి ఎంతో బాధను అనుభవిస్తూ దుర్భర జీవితాన్నిగడుపు తుంటాయి.

ఆ విధంగానే జీవనాన్ని గడుపుతున్నారు భిక్షగాళ్లు .భిక్షగాళ్లు  ప్రతిరోజూ తిరగాల్సిందే. అలా తిరిగితేనే  నాలుగు పైసలు పుట్టేది.అయితే ఎంత తిరిగినా కొన్నిసార్లు ఆ నాలుగు పైసలు పుట్టవు. ఇక వారు భిక్షం అడుక్కోవడానికే పుట్టినట్టున్నారు. వారి బాధ చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది.మన కంటి నుండి నీరు కారకుండా మానదు. నిద్రాహారాలు లేకుండా ఉంటారు, ఆకలిని చంపుకొని ఉంటారు .


          ప్రతి సంవత్సరం చూస్తే  వేల కొద్ది వీరు పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం వీరి జనాభా అత్యధికంగా పెరుగుతుందని చెప్పవచ్చు.
ఇక ప్రతిరోజు వారికి అదే కార్యక్రమం ఉంటుంది .ఉదయాన్నే గుడి వద్దకు, మధ్యాహ్నం వేళ రోడ్ల మీదికి, సాయంత్రం మళ్లీ   గుడి వద్దకు వెళ్తారు.రోజంతా కష్టపడితే వారికి నాలుగైదు పైసలు వస్తాయి. ఒక్కోసారి వారికి చిల్లిగవ్వకూడా రావు. చెప్పాలంటే ,వారు ఎంత కష్టపడితే ఎంత సంపాదిస్తారు? వారు వేలు ,లక్షలు ఎప్పుడైనా చూసి ఉంటారా, కనీసం కడుపు నిండా సంతోషంగా భోజనం తిని ఉంటారా,కనీసం కంటినిండా నిద్రపోయి ఉంటారా.



ప్రతి ఒక్కరూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే వాహనాలను ఉపయోగిస్తారు .మరి వారికి నడక దారే గతి .అన్ని ప్రాంతాలు ,అన్ని ఏరియాలు,అన్ని ప్రదేశాలు వారివే.ఏ   ఒక్క ప్రదేశంను  వదిలిపెట్టి ఉండరు .నడక దారిలోనే వారి  ప్రయాణం అంతా సాగుతుంది .ఏవైనా పండుగల సమయాల్లో ప్రతి గుడి దగ్గర వేల మంది బిచ్చగాళ్లు ఉంటారు. కనీసం అప్పుడైనా దేవుడు కరుణిస్తాడని, నాలుగైదు పైసలు పుడతాయని  వారి ఆశ.

ఇక మిగతా సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను చూసుకుంటారు .ఎండా, వాన  ,రేయి పగలు అనే తేడా లేకుండా ప్రతిరోజు ఈ విధంగా  బిచ్చ మెత్తుకుంటూ ఉంటారు .కానీ వారికి తెలియదు ఈ సమాజంలో దోచుకునే మూర్ఖులు ఎక్కువ అవుతున్నారని. కనీసం వారిని చూచి చులకనగా చూస్తారు కానీ ,నాలుగైదు పైసలు మాత్రం ఇవ్వరు.వారి స్థానంలో ఉండి చూస్తే తెలుస్తుంది వారు పడే తపన ఏమిటో.



 ఇక వారి పిల్లల జీవితం చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. ఆ పసి పిల్లలకు తెలుస్తుందా ,భిక్షం ఎత్తుకునే విధంగా పుడతామని, బుల్లిబుల్లి  అడుగులతో ఎంతో హాయిగా ఉండాల్సిన వారు, ఇలా అడుక్కోవడం బాధ కలిగించే విషయం. వారి బాల్యం అంతా ఒకసారి చూసుకుంటే ఏమీ ఉండదు. పుట్టినప్పటి నుంచి మరణించినప్పటి వరకు అవే సమస్యలు, అదే దుర్భర జీవితం.
గుడి వద్ద అడుక్కుంటున్నారు, రోడ్ల మీద అడుక్కుంటున్నారు , రద్దీ ప్రాంతాల్లో కూడా అడుక్కుంటున్నారు .ఏ ఏరియా చూసినా ,ఏ ప్రదేశం చూసిన వీరే కనపడతారు.


       ఇక వీరిలో ఏ ఆశయాలు ఉండవు, ఏ కోరికలు కనిపించవు. ఉన్నది ఒకటే కోరక  బిక్షాటన చేయడం, మూడు పూటలా కడుపునిండా తినడం. వీరిలో మనలా హడావిడి ,తాపత్రయాలు కనిపించవు , ,అబద్ధాలు కనిపించవు, మోసాలు కనిపించవు, హోదాలు, పేరు ప్రఖ్యాతలు ఇవేమీ ఉండవు .వీరి జీవితం అంతా ఒక్కటే ,వచ్చిన నాలుగైదు పైసలతో కడుపు నింపుకోవడం.కడుపు నింపుకుంటూ జీవితాన్ని సాగిస్తారు. కాలం మారినా వీరిని మార్చేవారు కనపడటం లేదు.ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా వీరు మాత్రం ఇలాగే ఉండాల్సి వస్తుందేమో.

Monday, 23 April 2018

అమ్మా - నాన్న ఓ జీవితం






అమ్మ మనకు ప్రాణం పోస్తుంది. నాన్న మనకు జీవితాన్నిస్తాడు .అమ్మానాన్నలు లేని, ఏ ప్రపంచం లేదు.ఈ ప్రపంచమంతా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది.మన యొక్క సృష్టి ఆవిర్భావానికి మూలం ఆ అమ్మానాన్నలే .అమ్మ మన యొక్క బాధ్యతను స్వీకరిస్తే, నాన్న మన భారాన్ని భరిస్తాడు . మనల్ని  ఎంతోఉన్నత శిఖరాలకు చేర్చాలనే వారి తాపత్రయమే మనల్ని అత్యున్నత శిఖరాలు చేరవేస్తుంది. ఎంతో ఉన్నత శిఖరాల్లో చేరుతాం కూడా. చిన్నప్పట్నుంచే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు .మనకి ఏం కావాలన్నా కూడా తెచ్చిచ్చే బాధ్యత తల్లిదండ్రులే చూసుకుంటారు.  ఎంతో గారాబంగా చూసుకుంటారు.


ఈ చరాచర సృష్టికి మూల కారణమైన తల్లిదండ్రులు ఎంతో గొప్పవాడు. తల్లిదండ్రులు లేని జీవకోటికి మనుగడ లేదు. మనం దేవుని ఎంతగానోప్రార్థిస్తాం, చాలా కోరికలు కోరుకుంటాం. మరి మనకు కావలసిన కోరికలను నెరవేర్చే  తల్లిదండ్రులను మాత్రం ప్రార్థించడం ఎందుకు ?  , అలాగే మన సృష్టికి మూలకారణమైన తల్లిదండ్రులను ఆరాధించం.  మనకు అన్నీ ఇచ్చే మన తల్లిదండ్రులను గాక, ఏమీ ఇవ్వని భగవంతుడిని ప్రార్థిస్తారు .కానీ ఒకసారి ఆలోచిస్తే మనకు అన్నీ ఇచ్చే ఆ తల్లిదండ్రులను ఇచ్చింది ఆ భగవంతుడే కదా.అది మాత్రం ఎవరూ తెలుసుకోవడం లేదు.



ఆ భగవంతుడు మనం  ఏ వరం కోరుకోకుండానే తల్లిదండ్రులను  ఇచ్చాడు.మన సృష్టి కారణం వారే కదా. మన యొక్క  అవసరమైన ప్రతి కోరికలను తీరుస్తారు .కానీ తల్లిదండ్రులను మాత్రం పూజించక పోగా,కనీసం గౌరవించరు.బాగా ఆలోచిస్తే, భగవంతుడు మన తల్లిదండ్రులను రూపంలోనే ఉంటాడని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది

సాక్షాత్తు ఆ భగవంతుడే అంటాడు" నేను మీకు తల్లిదండ్రులను ఇచ్చాను. మీ సృష్టికి గల కారణం వారే కదా.   మీరు కోరిన కోరికలు తీర్చే తల్లిదండ్రులను నేను ఇచ్చాను.కానీ మీరువారిని మరిచిపోతున్నారు .మీకు ఉన్నటువంటి అజ్ఞానంతో దానిని గమనించడం లేదు.ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమించాలి. భగవంతుడిగా నేను సైతం కోరుకునేది అదే కదా.పరమాత్మ ఎక్కడో లేడు తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నాడు .దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి" . ఈ విధంగా ఆ భగవంతుడే అంటాడు.



ప్రస్తుత కాలంలో అయితే తల్లిదండ్రులను ఆరాధించేవారు  కనుమరుగై పోతున్నారు .మనమెంతో ఆప్యాయంగా అల్లారు ముద్దుగా పెంచిన వారికి, బహుమతిగా ఇంటి నుంచి వెలివేస్తున్నారు .మనం ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా తెచ్చిచ్చేవారు,చివరికి  వారి జీవితం ఎడారిలా మారిపోతోంది .వారు జీవించి ఉన్నంత వరకు పిల్లల శ్రేయస్సునే కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి కావలసిన,కోరుకున్న జీవితాన్ని కూడా అందిస్తారు.ఏం కోరుకున్నా ఇవ్వని భగవంతుడ్ని చాలా  కోరుకుంటాం , కానీ మరి అన్నీ  ఇచ్చే మన తల్లిదండ్రులను మాత్రం గుర్తించం. మరి ఏమీ ఇవ్వని ఆ భగవంతుడిని దేవుడిగా నమ్మినప్పుడు మనకు అన్ని ఇచ్చే తల్లిదండ్రులు కూడా దేవుళ్లతో సమానమే కదా! వారూ ఆ పరమాత్మతో సమానమే కదా ! వారు ఎంతో కష్టపడి మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనే వారి  ఆశ మహోన్నతమైనది .చాలా గొప్ప మనసు కలవారు, అందుకే ఆ భగవంతుడే మనకు తల్లిదండ్రులను ఇచ్చాడు  , ప్రతి ఒక్కరూ దీనిని ఆలోచించాలి.


ప్రస్తుత కాలంలో అయితే తల్లిదండ్రులను ఆదరించేవారు కరువైపోతున్నారు. ఎంతో ప్రేమతో మనల్ని పెంచి పోషించిన వారికి ఆదరాభిమానాలు కరువైపోతున్నాయి .ప్రస్తుతం చూస్తే రోజురోజుకు తల్లిదండ్రులను వదిలించుకున్న వారు ఎక్కువైపోతున్నారు. నానాటికీ  old Age Homes వృద్ధాశ్రమాలు  నిండిపోతున్నాయి .మన కలల్ని సాకారం చేసిన వారికి బహుమతిగా వృద్ధాశ్రమాలలో వదిలిపెడుతున్నారు .ఇది ఎంత వరకు న్యాయం .

ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన కూడా ఓల్డ్ ఏజ్ హోం Old Age Homes  లలో  వృద్ధుల సంఖ్య పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.   అదేవిధంగా తల్లిదండ్రులు వృద్ధులు అయ్యాక ,వారిని భారంగా చూస్తున్నారు. వీటిసంఖ్య చాలా ఎక్కువగా ఉండటం విశేషం. మరికొంత మందైతే  హోల్డ్ ఏజ్ హోమ్స్ old Age Homes లలో వదలక పోగా,  ఎక్కడో ఒక చోట వదిలిపెడుతున్నారు. మరికొంత మంది అయితే  స్మశాన వాటికల్లో అనాథలా వదిలిపెడుతున్నారు. ఇది చాలా బాధాకరం.



   ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పులు రావాల్సి ఉంది. చిన్నతనంలో తమ తల్లిదండ్రులు ఏ విధంగానైతే ప్రేమించారో,  ఆ విధంగా తమ తల్లిదండ్రులనూ ప్రేమించే విధంగా ఉండాలి. తల్లిదండ్రులను చూడటం ఒక భారంగా అనుకోకూడదు .తల్లిదండ్రులను ప్రేమిస్తే, ఆ భగవంతుడిని ప్రార్థించినట్టే .

Saturday, 7 April 2018

కలల ప్రపంచానికి దూరాన






      ఎన్నో కలలు ఎన్నో ఆశయాలు ప్రతి విద్యార్థిని ముందుకు నడిపిస్తాయి. ఎన్నో ఊహలతో, తమ జీవితం   అందంగా  ఉండాలని   కోరుకుంటారు. అందుకుగానూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. తమ జీవితాన్ని అందంగా మార్చుకోవడం కోసం అందుకు తగిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పుస్తకాల పురుగులుగా    మారతారు.   నిరంతరం   ఎంతో కష్టపడుతూ      ఉంటారు.     తాము      పెట్టుకున్న ఆశయాలతో    ఊహల్లో    తేలిపోతూ   ఉంటారు. కచ్చితంగా     ఏదైనా     సాధిస్తామనే   నమ్మకంతో ప్రయాణిస్తూ ఉంటారు.  ఒక నమ్మకంతో ( faith) సముద్రంలోని నావ లా ప్రయాణిస్తూ ఉంటారు.


   కానీ,   ఇక్కడ జరిగేది వేరు. ఎన్నో ఆశయాలతో ఉన్న యువతకు చుక్కెదురవుతోంది.  వారు కన్న కలలు  ఆవిరైపోతున్నాయి . ఊహించుకున్న  ఆశలు (ambitions)    నీరుగారిపోతున్నాయి.    వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగాలు రావడం లేదు. ఎన్నుకున్న ప్రభుత్వాలు యువత ఆశయాలకు కనీసం పునాదులు కూడా వేయడం లేదు.  ఎంతో  మంది   కన్న కలలకు    ఆటంకం ఏర్పడుతుంది. వారి     ఆశయాలు నిర్జీవంగా మిగిలిపోతున్నాయి.అటు చూస్తే , ప్రభుత్వాల నుండి సమాచారం రాక , ఇటు చూస్తే ఉద్యోగాన్వేషనలో ఎన్నిక (select) కాక   యువత    నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.వారి     ఆశయాలు      అన్నీ   ఆవిరైపోతున్నాయి. ఎంతో ప్రతిభ ఉన్న యువతకు వారి సామర్థ్యాన్ని    వెలికితీయడానికి      అవకాశం రావట్లేదు అని చెప్పవచ్చు.

     ఈ సందర్భంగా చాలామంది యువత ఎక్కువ     ఒత్తిడికి    గురై     ఆత్మహత్యలకు     పాల్పడటం జరుగుతోంది. తమ    కుటుంబాన్ని     అందంగా తీర్చిదిద్దుకోవాలన్న వారి కోరిక నీరుగారిపోతోంది. తమ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రుల   నమ్మకాన్ని ( faiths) నిలబెట్టుకోలేకపోతున్నామనే వారి దీనావస్థ ఎవరికీ అర్ధం కాదు.ఈ లోకం వారికి ఏమీ    ఇవ్వలేదనే    భ్రమ    వారిని ఆత్మహత్యలు     చేసుకునే       విధంగా ప్రేరేపిస్తోంది.   వారు సొంతంగా ఏర్పరచుకున్న రెక్కలకు ఎదురుగాలి వీస్తోంది. తమను కన్నవారిని శోకసంద్రంలో ముంచి వెళ్తున్నారు.


                 మరి,వారి రంగుల ప్రపంచానికి   అడ్డం తగులుతున్నది  ఎవరు?   ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడానికి కారణమేమిటి?  ఏం చేస్తే వారి ఆశయం నెరవేరుతుంది.ప్రభుత్వాలు (govt) మారినా తలరాత మారదా !     అన్నట్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ,     యువతకు ఉపాధి చూపించడం లేదు. కనీసం    ఒక మార్గం చూపించకపోవడం గమనార్హం. యువత కన్నకలలు ఊహాజనితంగానే    మిగిలిపోతున్నాయి. ప్రతి సంవత్సరం చూస్తే,    నిరుద్యోగం సమస్య (unemployment) అంతకంతకూ ( high level)  పెరిగిపోతుండడం  విశేషం.ప్రతిసంవత్సరం నిరుద్యోగ సమస్య ఎలా ఉందో     ఒకసారి గమనించవచ్చు.         

              Year            percentage 

         
               2007                  3.7
               2008                  4.1
               2009                  3.9
               2010                  3.6
               2011                  3.7
               2012                  3.7
               2013                  3.6
               2014                  3.5
               2015                  3.5
               2016                  3.5
               2017                  3.4
               2018                  3.5
Block-' + placement_id + '">

Tuesday, 3 April 2018

సొమ్ము ఒకరిది - సోకు ఒకరిది





మానవులు కష్టపడే తత్వం   గలవారు.  ఆ కష్టానికి తగినట్లుగా   ఫలితము   ఉంటుంది.   అది ఎందులో కష్టపడినా   సరే    ఫలితం    దక్కాల్సిందే.   ప్రస్తుతం మానవులను     డబ్బు  నడిపిస్తోంది .   డబ్బు లేని ప్రపంచమే లేదు అన్నట్లుగా ఉంటుంది.   ప్రతి మనిషి డబ్బుపై ఆధారపడాల్సిందే . డబ్బుకోసం ఎంతకైనా కష్టపడాల్సిందే.  కష్టపడతారు కూడా. డబ్బు అనేది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది.   ఆ డబ్బు కోసం ఎటువంటి పనులు    చేయడానికైనా  సిద్ధంగా ఉంటారు.


   ఒకరు ఎంతో కష్టపడి సంపాదిస్తారు. ఆ డబ్బుని అలాగే పొదుపు చేసుకుంటూ ఉంటారు   (saving money),  కొంతమంది     బంగారం   (gold form) రూపంలో      భద్రపరుచుకుంటారు.    అదంతా  కష్టపడినందుకు    ఫలితం . ఎంత కష్టపడితే  అంత డబ్బు    వస్తుందనే    ఆశ     ప్రతి     ఒక్కరిలోనూ ఉంటుంది.  డబ్బు   వస్తున్న    కొద్దీ మనిషిలో కలిగే  ఆశ  ఎప్పటికీ   తరిగిపోదు.   డబ్బుపై ఉన్న ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డబ్బు  వస్తున్న కొద్దీ ఇంకా కావాలని అనుకుంటాడు. పగలు,రాత్రి   అనే తేడా   లేకుండా    పనిచేస్తూ  ఎంతో సంపాదిస్తారు. అయితే వారు    సంపాదించిన    దానికి    ఫలితం ఉంటుంది. దానిని భద్రంగా  దాచుకుంటారు.   మరి  ఎంతకాలం   (howmany days )    సంపాదించిన సంపాదనను (earn money)  భద్రపరుచుకుంటారు ?  సంపాదించిన  డబ్బు అలాగే   జాగ్రత్తగా ఉంటుందా ?.



   మనం సంపాదించిన  డబ్బు   ఇంట్లో   అలాగే జాగ్రత్తగా ఉంటుంది      అనుకుంటే     పొరపాటే. మారుతున్న    పరిస్థితుల దృష్ట్యా ,  మారుతున్న కాలానుగుణంగా వాటిని దోచుకునేవారు (theft) మారుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు . ప్రస్తుతం ప్రతి   ఒక్కరు   టెక్నాలజికి (technology)  అలవాటు పడుతుంటే. వారు కూడా టెక్నాలజీల్లో    ముందుకు   దూసుకుపోతున్నారు .దొంగతనాలు చేయటంలో విభిన్నమైన టెక్నాలజీని ఫాలో (follow)  అవుతున్నారు. ఒక్కరి వల్ల సాధ్యం కాకపోతే గ్రూపుగా పనిచేస్తున్నారు.  ఎవరైనా అడ్డం వస్తే   ఏదైనా  చేయడానికైనా  వెనకాడకపోవడం గమనార్హం.  చంపడానికి    వెనుకాడడం   లేదు . అటువంటి వారు ప్రాణాలు తీయడం  కోసం లెక్క చేయడం     లేదు.   ప్రతి    సంవత్సరం    చూస్తే దొంగతనాలు     చేసేవారు    పెరుగుతుండటం విశేషం.  మరో విషయం  ఏమిటంటే  దొంగతనాలు ఎక్కువగా    యువతే     చేస్తుండటం    అందర్నీ  ఆశ్చర్యాన్ని    కలిగించే   విషయం.



డబ్బు మనిషిని నడిపిస్తుందని దాన్ని దానికి ఇది ఒక పెద్ద    ఉదాహరణగా   చెప్పవచ్చు  .  ఒకరు కష్టపడిన సొమ్మును ఇంకొకరు   దోచుకుంటున్నారు. దోచుకోవడంలో (theft)  కూడా కష్టపడిన  దానికి ఫలితం ఉంటుంది.  ఎవరైనా ఒకసారి ఇల్లు వదిలి వెళ్లాలంటే     ఇక  అంతే    సంగతులు.     వచ్చిన      తర్వాత   చూస్తే   సంపాదించిన  డబ్బు,  బంగారం కనిపించవు.    ఇలా ఒకరు   సంపాదించిన దానికి ఫలితం ఇంకో వారు అనుభవిస్తారు .అందుకే మన   పెద్దలు     సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అని అన్నారు.

Sunday, 1 April 2018

మానవత్వం అంతరించిన వేళ

 


     మానవత్వం అనేది ప్రతి   ఒక్కరికీ  ఉంటుంది. మానవత్వం ఉంటే కనుక   ఎవరి   జీవితమైనా ఆనందంగా ఉండడానికి   కారణం అవుతుంది. అసలు మానవత్వానికి ముగింపు లేదనే చెప్పవచ్చు . ఎప్పటికీ    ఉండదు   కూడా.    ఒక మనిషిలో మానవత్వం అనేది  ఎప్పుడు పడుతుందంటే, ఎవరైనా ఆపదలో ఉన్నపుడు, ఎవరికైనా సహాయ సహకారాలు అవసరమైనపుడు     మానవత్వం పుడుతుంది. మానవత్వం అనే పదాన్ని దేవుడిచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. సగటు మనిషికి కష్టం వస్తే ఆదుకునే అవకాశం ఎంతో పుణ్యానికి నాందిగా పేర్కొనవచ్చు .



అయితే ప్రస్తుతం చూస్తే మానవత్వం అనే పదం అంతరించిపోయిందని     చెప్పాలి.    ప్రస్తుత సమాజంలో మానవత్వాన్ని  ఇంచుకైనా ఎక్కడా కనపడదు. ఎంతో టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో    ఆ టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆ టెక్నాలజీకి అలవాటు    పడుతున్నారే    తప్ప ,ఇతరులకు సాయం చేయాలనే మాట గతి తప్పింది. సహాయం కోరవచ్చని వారిని చులకనగా చూడడమే తప్ప  వారి యొక్క దీనావస్థను   ఎవరూ   అర్థం చేసుకోరు.ఇక ఆపదల్లో ఉన్న వారికి సైతం సాయం చేయకపోవడం గమనార్హం.

     ప్రస్తుతం అయితే ఎవరైనా ఆపదలలో  ఉండి సహాయం కోరినా పట్టించుకోవజం లేదు.   వారి యొక్క ఆర్తనాదాలను  ఎవరూ   వినిపించుకోరు.     ఆ సమయంలో ప్రక్కనే  ఎంతో మంది    ఉన్నా కనికరించే వారే లేరే  అనే వారి బాధ వర్ణనాతీతం. మొబైల్ ఫోన్స్ తో వీడియోలు చేసుకుంటారే గాని, కొంచెం సాహాయం చేయాలనే     ఆలోచన కూడా ఎవరికీ రాదు. రేపు మన పరిస్థితి ఇలాగే వస్తే ఏంటి ! అని ఎవరూ ఆలోచించడం లేదు.



  అదే విధంగా రోడ్లపై ఎంతోమంది బిచ్చగాళ్ళు ఉంటున్నారు. మరియు ప్రతి దేవుళ్ల గుడి వద్ద కూడా ఎంతోమంది ఉంటారు. కనీసం వారిని    ఆదుకునే వారే కరువయ్యారు.   ప్రస్తుతం ప్రతి   సంవత్సరం చూసుకుంటే వారి    జనాభా    పెరుగుతుండటం విశేషం. ఎన్నుకున్న    ప్రభుత్వాలు   మారుతున్నా బిచ్చగాళ్ల జీవితాలు మారడం లేదు.కనీసం వారి  పిల్లలను సైతం బిక్షాటన చేయిస్తుండటం బాధాకరం .పసి హృదయాలు రోడ్లపై భిక్షాటన చేస్తున్నారు.


 
  అసలు మానవత్వం అనేది ఎక్కడా కనిపించడం లేదు.     ప్రతి మనిషి    తన   జీవితం    మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నాడు గానీ ,ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన కూడా రాదు, ప్రస్తుతం ప్రతి మనిషిలోఎవరు ఎటు పోతే   నాకేంటి! అనే స్వార్థం   పెరిగిపోతోంది.     చూసి      చూడనట్లు వ్యవహరిస్తున్నారు     గానీ,     తమ  స్వార్థాన్ని మాత్రంవిడిచి పెట్టడం లేదు.

   భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎంతో    జ్ఞానాన్ని ఇచ్చాడు.దానిని   మంచి   మార్గంలో   గాక, చెడు మార్గంలో         ఉపయోగించుకుంటున్నారు. భగవంతుడిచ్చిన     జ్ఞానాన్ని స్వార్థంతో  నింపేసుకోవడం   అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

Saturday, 3 March 2018

దోచుకున్న వాళ్ళకు దోచుకున్నంత




       డాక్టరు ను భగవంతుడు  అంటారు.వారిని భగవంతుడితో       పోలుస్తారు.       ప్రాణాలను కాపాడటానికి వచ్చిన భగవంతుడు అంటారు . మరి అలాంటి స్థాయిని కలిగినటువంటి వారు అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నారు.కొత్త ఆలోచనలకు పునాది వేస్తున్నారు.సాధారణ కాన్పు చేయాల్సిన దానికి  కత్తెరలతో    కోత      (సిజేరియన్)
పెడుతున్నారు.అక్రమ దందా వైపు అడుగులు వేస్తున్నారు.సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నా కూడా ,సాధారణ కాన్పు చేయకుండా ఆపరేషన్లను చేస్తున్నారు .
   
               ప్రస్తుతమైతే ప్రతి 100 లో 90 మందికి ఆపరేషన్లు చేస్తుండటం గమనార్హం.ప్రజలు ఒక డాక్టరును దేవుడిగా పూజిస్తారు. కానీ ,ఆ డాక్టర్లు మాత్రం అలా అనుకోవట్లేదు.డబ్బే ప్రధానంగా చూసుకుంటున్నారు ఒక ఆపరేషన్ కు వేలు, లక్షల్లో వసూలు  చేస్తున్నారు .అవసరం లేకున్నా కూడా ఆపరేషన్స్ చేయడం వలన కొన్నిసార్లు,ఆ గాయం మూలానా అటు తల్లికి గానీ, ఇటు బిడ్డకు గాని ప్రమాదంతో చనిపోతుండడం విశేషం. ఒక వేళ తల్లికి గాని, బిడ్డకు గాని ఏదైనా ప్రమాదం సంభవిస్తే, అప్పుడు కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రజలు లక్షల్లో డబ్బు పెట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎలాగో అప్పు చేసి కట్టినా కూడా, తల్లి బిడ్డకు ప్రమాదం సంభవించి ఏదైనా జరిగితే ఇక అంతే సంగతులు.
       
               
           ఇక భార్యాభర్తలు అయితే డాక్టర్లు ఏం చెబితే అదే వింటారు. తప్పదు కూడా. బిడ్డ అడ్డం తిరిగింది లేదా తల్లికి ప్రమాదంగా ఉందని, ఏదో ఒక సాకుతో ఆపరేషన్      చేయాలని     నమ్మకం కలిగిస్తున్నారు  .   కానీ ఆ భర్త , తాను తండ్రి కాబోతున్నాడన్న ఆనందంతో డాక్టర్ ఏం చెప్పినా సరే అంటాడు .ఇక బంధువులు కూడా అంతే. డాక్టర్లు నమ్మకంగా నమ్మిస్తారు.సాధారణ కాన్పు కోసం హాస్పిటల్కు వెళితే అది ఆపరేషన్గా మారిపోతుంది. కత్తెరతో కోత పెడతారు. ఇలా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆపరేషన్లు చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు .డాక్టర్లే దేవుళ్లు అన్ని నమ్మిన ప్రజాలోకానికి  కొన్ని కార్పొరేట్ హాస్పటల్లో తమ నమ్మకాన్ని పెంచుకుంటూ, దోపిడీ చేస్తుండటం గమనార్హం.
   
             ఒకప్పుడు ఆపరేషన్లు 10 శాతంగా ఉండేది .కానీ ఇప్పుడు 30 శాతానికి పెరిగింది. దేశంలో ప్రతి 100 మందిలో 90 మందికి సిజేరియన్ జరుగుతోంది .   కత్తెర    కోతలతో     ప్రతి       గంటకు     ఐదుగురు చనిపోతుండటం    విశేషం.   ఈ విధంగా     కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలు వ్యాపారం చేస్తూ లక్షల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రసవంఎంతో మంచిదని ప్రచారం చేసినా ,     ప్రజలు    దానిపై నమ్మకం ఉంచడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్కి క్యూ కట్టడం విశేషం.

Thursday, 1 March 2018

గొప్ప దేశంగా ఇండియా


          ఇండియా ఒక గొప్ప దేశంగా ప్రతి ఒక్కరు భావిస్తారు. ఎందుకంటే ఇండియా సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక."భిన్నత్వంలో ఏకత్వం" గల ఏకైక దేశం. ఆచారవ్యవహారాలకు పుట్టినిల్లు. భారతదేశంలో ఉన్న అన్ని మతాలు మరియు అన్ని వర్గాలు వేర్వేరు మరియు ఏకైక సంస్కృతులకు సమిష్టిగా సూచిస్తుంది.భారతదేశం యొక్క భాషలు, మతాలు, నాటక రంగం సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు అనేవి భిన్నంగా ఉంటాయి.భారతీయ సంస్కృతి అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలవబడుతున్నది .ఇది భారత ఉపఖండంలో విస్తరించి ఉంది. మరియు అనేక వేల సంవత్సరాల వయస్సు కలిగిన చరిత్రగా మనకు చూపబడుతోంది.

      ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపేవి:

1) భారతీయ మతాలు
2) భారతీయ వంటకాలు
3) నాటక రంగం
4) ఆచార వ్యవహారాలు
5) సంస్కృతి సంప్రదాయాలు
6)భిన్నత్వంలో ఏకత్వం
7)ఏకధాటిపై ఉండటం
8)భక్తి ఆ పారవశ్యత
ఇవన్నీ ప్రపంచ దేశాలు సైతం ఇండియాను వైపు చూడటానికి ప్రభావితం చేస్తున్నాయి.ఇండియా ఒక చారిత్రాత్మక గొప్ప దేశంగా ప్రసిద్ధి గాంచింది.
         

Culture:

   భారత దేశం వివిధ సంస్కృతి మరియు నాగరికతలతో 29  రాష్ట్రాలు కలిగి ఉంది .ఈ మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి.భారతీయ చరిత్ర మొత్తంలో భారతీయ సంస్కృతి ధార్మిక మతాల చే బాగా ప్రభావితమైంది .వారు భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం ,వాస్తు శిల్పం, కళ మరియు సంగీతం యొక్క చాలా ఆకృతిని రూపొందించారు.ప్రత్యేకించి హిందూమతం,బౌద్ధమతం ,వాస్తు శిల్పం పరిపాలనా మరియు లేఖన వ్యవస్థ భారతదేశం నుండి ఆసియాలోని ఇతర భాగాలకు సిల్కు రోడ్డు ద్వారా ప్రయాణికులు మరియు సముద్ర వ్యాపారుల ద్వారా తొలి శతాబ్దాలలో విస్తరించింది .శతాబ్దాలుగా బౌద్ధులు,జైనులు, ముస్లింసిక్కులు మరియు గిరిజన జనాభా మధ్య గణనీయమైన కలయిక ఉంది .భారతీయ మతాల అనుచరులు ,హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు భారతదేశంలో 80-82%  జనాభా ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం భారదేశంలో 79.8% మంది హిందుమతాన్ని పాటిస్తున్నారు.ఇస్లాం14.2%, క్రిస్టియానిటీ 2.3%,సిక్కు మతం1.7 ,బౌద్ధమతం0.7, జైన మతం 0.4%.మరియు అనేక గిరిజన మతాలు ఉన్నాయి.

వివాహ బంధం:


       తరతరాల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో సంప్రదాయబద్ధంగా ఉంది .తల్లిదండ్రులు ,పిల్లలు, పిల్లల జీవిత భాగస్వాములు మరియు వారిసంతానం మొదలైనవి.కుటుంబ సభ్యులందరూ విస్తరించినప్పుడు కలిసి జీవించడం జరుగుతూ వస్తోంది .అతిపురాతన సభ్యుడు ఉమ్మడి కుటుంబవ్యవస్థలో అధిపతి.అతడే ముఖ్యమైన నిర్ణయాలను మరియు నియమాలను తీసుకుంటాడు. ఇతర కుటుంబ సభ్యులు వారిచే కట్టుబడి ఉంటారు .అలాగే భారతీయ  సమాజంలో అమర్చిన వివాహాలు దీర్ఘకాలంగా కట్టుబడి
 ఉన్నాయి. నేటి కూడా ఎక్కువ మంది భారతీయులు వారి తల్లిదండ్రులు మరియు ఇతర గౌరవనీయమైన కుటుంబ సభ్యులచే వివాహం చేసుకుంటారు .వివాహాల్లో ఎక్కువమంది వధువు కుటుంబం వరుడి కుటుంబానికి కట్నం ఇస్తారు. సంప్రదాయకంగా వరకట్నం కుటుంబ సంపద యొక్క, ఒక మహిళ యొక్క వాటాగా పరిగణించబడుతుంది. కుటుంబాల్లో కుటుంబ వారసత్వం పురుషులు మరియు స్త్రీలను వారసత్వంగా వ్యవహరిస్తుంటాయి. వారసత్వం మరియు  ఆస్తి వారసత్వం కోసం భారతీయులు చట్టచట్టబద్ధమైన వాడకాన్ని వినియోగిస్తున్నారు.

పురాతన దేవాలయాలు:

 

   అతి పురాతన దేవాలయాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి. అత్యంత శక్తి పీఠాలు కూడా మన ఇండియాలో చాలా ఏళ్ల నాటి చరిత్ర కలిగినవి. ఈ దేవాలయాలను చూస్తే మనసుకు  ప్రశాంతత కలుగుతుంది .ఈ దేవాలయాలు       ఇండియాలో ఉన్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటాయి. ఇండియాలోనే అతి     పురాతన దేవాలయాలు      ఇండియా     యొక్క ప్రసిద్ధిని చూపుతాయి ,ఇండియాలోని ప్రజలు భక్తి మార్గంలో తమ వైఖరిని చెబుతారు. ఆ       భగవంతుడ్ని ప్రార్థించడం భారత ప్రజలకు పురాతన కాలం నుంచి వస్తోంది.తమ ఆచారాలకు       సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఈ విధంగా ఇండియా     అతి పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి గాంచింది.దీనిని బట్టి ఇండియా ఒక గొప్ప దేశంగా భావిస్తారు